ఆటా సదస్సులో తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు పుస్తకావిష్కరణ.!
Publish Date:Aug 3, 2026
Advertisement
ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు పుస్తకాన్ని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా ) 19వ వార్షిక సాహితీ సమావేశాల్లో ఆటా లిటరరీ విభాగం అధ్యక్షుడు వేణు నక్షత్రం, తెలంగాణా భాషా, సాంస్కృతిక శాఖ, సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటా లిటరరీ విభాగానికి చెందిన సూర్య నాంపెల్లి, రాజేశ్వరరావు టెక్మాల్, ప్రకాష్ తిమ్మాపురం, వెంకటకృష్ణారెడ్డి గుజ్జుల, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆటా అధ్యక్షులు, జయంత్ చల్లా, ఎంపికైన ఆటా అధ్యక్షులు, సతీష్ రెడ్డి రామసహాయం, కన్వీనర్, శ్రీధర్ బానాల ఆటాసభలకు విశిష్ట అతిథిగా హాజరైన రచయిత ఈమని శివనాగిరెడ్డిని అభినందించారు. Milestones in Telangana History book launch, ATA, America, Pleach India Foundatio
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
http://www.teluguone.com/news/content/milestones-in-telangana-history-book-launch-36-227899.html





