తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న మెసారా ఇన్ఫ్రా డెవలపర్ అధినేత మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డిని మాదాపురం పోలీసులు అరెస్టు చేశారు. సుబ్బారెడ్డి శనివారం ఉదయం హైటెక్ సిటీలో ఒక హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా సమాచారం తెలుసుకున్న బాధితులు, మాదాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సుబ్బారెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న హోటల్ కి వెళ్లిన పోలీసులు, సుబ్బారెడ్డిని అరెస్టు చేశారు. ఏపీలో కూడా సుబ్బారెడ్డి పై కేసులు నమోదై ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో పెంచల సుబ్బారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పను కూడా కోటి రూపాయలు మోసం చేసిన దాంట్లో సుబ్బారెడ్డి పై గద్వాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఇతను గత రెండేళ్లుగా వివాదాస్పద భూములపై ఫ్రీ లాంచ్ వెంచర్లంటూ అందమైన బ్రోచర్లతో వందలాదిమందిని ముంచి సుమారు రూ.100 కోట్లకు పైగా దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు బాధితులకు చిక్కిన మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి మాదాపురం పోలీసులు అదుపులో ఉన్నాడు. లేని భూమిని ఉన్నట్టు చూపించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్న సుబ్బారెడ్డి ఇప్పుడు అరెస్టు అయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mesara-infra-developer-36-222092.html
భాష్యం విద్యాసంస్థల చైర్మన్గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్పల్లి మంజీరా మాల్లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.