మమత ఆగ్రహం..త్రివేదిని ఢీ కొట్టిన బడ్జెట్ రైలు
Publish Date:Mar 15, 2012
Advertisement
న్యూఢిల్లీ: ప్రయాణికుల వైపు దూసుకొస్తున్న బడ్జెట్ రైలు దారి తప్పి ఏకంగా రైల్వే మంత్రిని ఢీ కొట్టింది. పట్టాలపై భద్రతా చర్యలు తీసుకొనే ప్రయత్నంలో మంత్రి దినేశ్ త్రివేదీ.. బడ్జెట్ రైలు కింద పడ్డారు. చార్జీల పెంపు వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. సామాన్యులపై భారం వేస్తూ రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు దినేష్ త్రివేది బడ్జెట్ను ప్రవేశపెట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం, అందుకు త్రివేది అంగీకరించకపోవడంతో ఆయనను తొలగించాలంటూ ఏకంగా ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాసారు. మమతా బెనర్జీ పట్టువీడని పక్షంలో త్రివేదిని తప్పించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రైల్వే చార్జీలు పెంచిన దినేష్ త్రివేదిని తొలగించాలంటూ మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం మన్మోహన్ సింగ్కు ఒక లేఖ రాశారు. దినేష్ త్రివేది మంత్రివర్గంలో కొనసాగటం తమకు ఇష్టం లేదని మమతా బెనర్జీ ఆ లేఖలో స్పష్టం చేశారని తెలిసింది. తృణమూల్కే చెందిన ముకుల్ రాయ్కు ఆ పదవిని అప్పగించాలంటూ మమత లేఖ రాశారు. పార్టీ అధ్యక్షురాలే తమ పార్టీకి చెందిన త్రివేదిని తొలగించాలని అధికారికంగా లేఖ రాయటంతో ఇరకాటంలో పడిన మన్మోహన్ సింగ్ రాత్రి కాంగ్రెస్ కోర్ కమిటీకి పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీలో మమతా బెనర్జీ రాసిన లేఖ, రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేదిని తొలగించే పక్షంలో యుపిఏలో ఏర్పడే సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిపారు. లోక్సభ నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎల్లుండి (శుక్రవారం) లోక్సభలో 2012-13 సంవత్సరం వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించిన అనంతరం మమతా బెనర్జీతో చర్చలు జరపాలని కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు దినేష్ త్రివేదిని కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించేందుకు అంగీకరించాలని ప్రణబ్ ఆమెను కోరనున్నారు.
కాగా, త్రివేదిని మంత్రివర్గం నుండి తొలగించని పక్షంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని మమతా బెనర్జీ ప్రధాన మంత్రితోపాటు సోనియా గాంధీకి స్పష్టమైన సందేశం పంపించారని అంటున్నారు. మమతా బెనర్జీ చేసిన ఈ అల్టిమేటం మూలంగానే మన్మోహన్ సింగ్ రైల్వే మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/mamatha-benarji-24-12660.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





