మహాజన ప్రభంజనం.. మహానాడు

Publish Date:May 29, 2023

Advertisement

రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పండుగ మహానాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రజల ముందు ఉంచింది. మే నెల 27, 28 తేదీలలో జరిగిన తెలుగుదేశం వార్షిక ప్రతినిథుల సభ, బహిరంగ సభలు ఆ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ ను నింపాయి.  27వ తేదీన సుమారు 15వేల మంది హాజరౌతారని అశించిన ప్రతినిథుల సభకు 40 వేల మందికి పైగా హాజరు కావడంతో ప్రతిపక్ష తెలుగుదేశంలో ఆనందం, అధికార వైసీపీలో గుబులు ఒక్కసారిగా బయటపడ్డాయి.  తెలుగుదేశం పార్టీ ఆ జోష్ ను రెండు రోజుల పాటు కొనసాగించగా, వైసీపీ తన అక్కసును అనేక రకాలుగా ప్రకటిస్తూనే వచ్చింది. 

రాజమండ్రి శివారు ప్రాంతమైన వేమగిరిలో జరిగిన రెండు సభలూ సూపర్ హిట్ కావడంతో పసుపు క్యాడర్ లో  పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరో వైపు పరిస్థితిని గమనించిన వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డు పడటం కనిపించింది. ముందు రోజు నుండీ ఫ్లెక్సీలు చించివేయడం, సభలకు స్థలాన్ని ఇచ్చిన వారిని బెదరించడంతో పాటు.. లక్షలాది మంది ప్రజలు హాజరౌతున్న సభలకు అంబులెన్సులను ఇచ్చే వారిని కూడా వైసీపీ నేతలు బెదరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇన్ని అవరోధాల మధ్య మహానాడు మహా విజయాన్ని స్వంతం చేసుకుంది.

రాజమండ్రి నగరంలో, సభలు జరిగే చోట భారీ వాహనాలను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ సమస్యను సృష్టించారని స్థానిక టీడీపీ నేతలు వైసీపీ  నేతలపై, ప్రభుత్వ శాఖల అధికారులపై ఆరోపణలు చేయడం కూడా కనిపించింది. 

ఇన్ని అవాంతరాల మధ్య రెండు రోజుల పాటు సాగిన మహానాడు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రతినిథుల మహాసభల దాదాపు ప్రతి నాయకుడూ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభ ముందు ఉంచే ప్రయత్నం చేశారు.  27వ తేదీన ప్రతినిథుల మహా సభలో పార్టీ ముఖ్యులు చేసిన ప్రసంగాలు పార్టీ ప్రతినిథులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిథులు రావడంతో సభకు నిండుదనం చేకూరింది.  సుమారు  40 డిగ్రీల ఎండ కాస్తున్నా లెక్క చేయకుండా ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల దాకా సాగిన ప్రతినిథుల మహా సభ పార్టీలోని క్రమశిక్షణను చెప్పకనే చెప్పింది.
ప్రతినిథుల సభలో అధినేత చంద్రబాబు ప్రసంగం హైలైట్ గా నిలిచింది. కౌరవులను ఓడించి గౌరవ సభలోకి అడుగుపెడతానని బాబు చెపపినపుడు ప్రతినిథుల సభ హర్షం వ్యక్తం చేసింది. అదే రోజు సాయంత్రం జరిగిన జాతీయ అధ్యక్షుడి ఎన్నికల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రానున్న ఎన్నికలలో యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తామని, క్రమశిక్షణ పాటించని నాయకులను పార్టీ ఆదరించే ప్రశ్నే లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.  మొత్తం 19 తీర్మానాలను ఆమోదించారు.

 28వ తేదీన జరిగిన భారీ బహిరంగ సభ పార్టీ పట్టును మరోసారి తెలిపింది. లక్షల మంది హాజరైన ఈ సభలో పార్టీ అధినేత మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రకటించిన మానిఫెస్టో రానున్న ఎన్నికలలో విజయానికి తొలి సంకేతమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 
మినీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చేసిన ప్రకటనల్లో ఎ క్కడా వ్యక్తుల పేర్లను పథకాలకు పెట్టలేదు.  18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిథి, చదువుకునే పిల్లల తల్లులకు తల్లికి వందనం, జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు వసతి, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల భృతి ఈ మినీ మేనిఫెస్టోలో ముఖ్యమైనవి. ఇవి కాక అధికారం ఉండే ఐదేళ్లలో 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించే బాధ్యత తనదేనంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు తెలుగుదేశం శ్రేణులకు అమితానందాన్ని కలిగించాయి.  

ఏది ఏమైనా రాజమహేంద్రవరం మహానాడు తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, శ్రేణులకు ఒక మధుర జ్ణాపకంగా నిలిచిపోనుంది. 2023 మహానాడు స్ఫూర్తితో రానున్న ఎన్నికలకు సమాయత్తం కావడానికి తెలుదండు జిల్లాలకు తరలివెళ్లింది. 

By
en-us Political News

  
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.