సీఎస్ సోమేష్ కుమార్ కు ఉద్వాసన తప్పదా? ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ ఏరి కోరి తెచ్చుకున్న సోమేష్ కుమార్ ఇప్పుడు ఆయన నమ్మకాన్ని కోల్పోయారా? అంటే అధికార వర్గాల్లో ప్రచారం మేరకు ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తే అయినప్పటికీ సోమేష్ కుమార్ క్యాట్ ఆర్డర్స్ మేరకు తెలంగాణలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన వ్యవహార శైలి సీఎంకు పెద్దగా నచ్చుతున్నట్లు కనబడదు. అంతే కాకుండా సీఎంలు, చీఫ్ జస్టిస్ ల సదస్సులో సీఎస్ సోమేష్ వ్యవహార శైలిపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. సీఎం కేసీఆర్ ఆయనకు ఉద్వాసన పలకడమే మేలని నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారమౌతోంది. విధి నిర్వహణలో సీఎస్ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సీఎం స్వయంగా చెప్పన అంశాల అమలులో కూడా అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం సీఎస్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఎంతో నమ్మకంతో డజను మంది సీనియర్లను సైతం తోసి రాజని ఏరి కోరి సోమేష్ కుమార్ ను సీఎస్ గా సీఎం కేసీఆర్ తెచ్చుకున్నారు. సీనియారిటీ లేని వ్యక్తికి సీఎస్ పదవి ఏమిటని రేవంత్ వంటి ప్రతిపక్షాల నేతలు ఎన్ని మార్లు ఆరోపణలు, విమర్శలు చేసినా సీఎం కేసీఆర్ ఖాతరు చేయలేదు. అయితే ఇప్పుడు సీఎస్ వ్యవహార శైలి పట్ల స్వయంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సీఎస్ వ్యవహారశైలి, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాని సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సీజేఐ సీఎస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇక ఉద్వాసన చెప్పక తప్పదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణారావుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lost-confidence-in-somesh-will-co-oost-cs-somesh-25-135399.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.