లోకేష్ దే మంగళగిరి!

Publish Date:Apr 22, 2024

Advertisement

మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందే విజయం ఎవరిదో ఖరారైపోయింది. ఈ విషయంలో ఇంకా నమ్మని వాళ్లెవరైనా ఉంటే.. ప్రచారంలో భాగంగా అధికార పార్టీ అభ్యర్థికి అడుగడుగునా ఎదురౌతున్న పరాభవాల పరంపరను చూస్తే అర్ధమైపోయింది. మంగళగిరి నియోజవకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గాన్ని లోకేష్ తొలి సారి ఎంచుకుని పోటీకి దిగినప్పుడే చాలా మంది అరెరె ఎందుకిలా అనుకున్నారు. అయితే సవాళ్లను స్వీకరించి పోరాడటమే తన నైజమని చాటుతూ 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 

సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ నియోజకవర్గంలో కనిపించడం అరుదు. అయితే నారా లోకేష్ అందుకు భిన్నం. పరాజయం పాలైన నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించి ఈ ఐదేళ్లూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు.  ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అంకితమై మంగళగిరి ప్రజలకు అండగా నిలిచి వారి గొంతుకలా మారి అధికార వైసీపీ అక్రమాలూ, దౌర్జన్యాలను ప్రశ్నించారు. నిలదీశారు.  గత ఐదేళ్లలో వివిధ సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని లోకేష్ నిరంతరం ప్రశ్నించారు. లోకేష్ చిత్తశుద్ధిని గమనించిన  మంగళగిరి ప్రజలు  ఈ సారి తమ ఓటు లోకేష్ కే అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు. మంగళగిరిలో లోకేష్ ఆదరణను గమనించిన వైసీపీ అక్కడ ఒకరు కాదు, ఇద్దరు  అభ్యర్థులను మార్చి చివరికి మురుగుడు లావణ్యను పార్టీ అభ్యర్థిగా నిలిపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే లోకేష్ పై విజయం సాధించడం సాధ్యం కాదని భావించిన వైసీపీ అధినేత జగన్, తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవిని చేర్చుకుని మరీ ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మళ్లీ ఆయనను కూడా కాదని  మురుగుడు లావణ్యను పోటీకి దింపింది. ఈ మార్పులూ చేర్పులూ ఏవీ నియోజకవర్గ ప్రజలలో లోకేష్ పై ఉన్న అభిమానాన్ని ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. నియోజకవర్గం మొత్తం లోకేష్ వైపు మొగ్గు చూపుతోందని ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ కు అడుగడగునా లభిస్తున్న జననీరాజనమే సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లడుగుతున్న సందర్భంలో  ఓ వృద్ధురాలు తన  ఓటులోకేష్‌కే అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, జగన్  పథకాల కంటే లోకేష్ వల్లనే ఎక్కువ లబ్ధి పొందుతామని తెగేసి చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

By
en-us Political News

  
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. 
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
 బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.