Publish Date:Apr 22, 2024
జగన్ మెప్పు కోసం అత్యుత్సామం ప్రదర్శించిన బెజవాడ పోలీసులు చివరకు తప్పు తెలుసుకుని దిద్దుకునే పనిలో పడ్డారా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో ఏ2గా పేర్కొంటూ అదుపులోనికి తీసుకున్న దుర్గారావును విచారణ అనంతరం నిర్దోషిగా తేల్చి వదిలేశారు.
ఇటీవల విజయవాడలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు గులకరాయితో దాడి చేశారు. దాడి జరిగిన క్షణం నుంచీ వైసీపీ నేతలు దాడి వెనుక తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఈ దాడి ద్వారా సానుభూతి పొంది ఎన్నికలలో లబ్ధి పొందాలని తహతహలాడారు. పోలీసులు కూడా ఈ కేసులో తెలుగుదేశం వారిని ఇరికించేందుకు అత్యుత్సాహం చూపారు. దాడి కారకులను పట్టిస్తే రెండు లక్షల రివార్డు అని ఆర్భాటంగా ప్రకటించిన పోలీసులు వారంతట వారే దాడికి పాల్పడ్డాడంటూ ఇద్దురు యువకులను అరెస్టు చేశారు. వారిలో సతీష్ అనే వడ్డెర కాలనీకి చెందిన యువకుడిని ఏ1గా పేర్కొన్నారు. అతడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు రిమాండ్ కు తరలించారు.
ఇక ఈ కేసులో ఎ2గా దుర్గారావు అనే వ్యక్తిని పేర్కొని అతడిని అదుపులోనికి తీసుకుని విచారించారు. తెలుగుదేశం కార్యాలయంలో పని చేసే దుర్గారావును అరెస్టు చేసి జగన్ పై గులకరాయి దాడి వెనుక తెలుగుదేశం హస్తం ఉందనే సంకేతాలు ఇచ్చారనీ, వైసీపీ వారు దుర్గారావు అరెస్టును పేర్కొంటూ దాడి వెనుక ఉన్నది తెలుగుదేశం అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలను తెలుగుదేశం గట్టిగా ఖండించింది. ఈ కేసులో బొండా ఉమను అరెస్టు చేసి ఆయన నామినేషన్ వేయకుండా అడ్డుకుని వెల్లంపల్లికి లైన్ క్లియర్ చేయాలన్న కుట్ర ఉందని ఆరోపణలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలోనే గులకరాయిదాడి కేసులో దుర్గారావు నిర్దోషి అని పేర్కొంటూ పోలీసులు అతడిని విడుదల చేశారు. విచారణ పేరుతో దుర్గారావును బెదరించి అయినా నేరం చేసినట్లు అంగీకరించేలా చేయాలన్న దుష్ట పన్నాగం పారనందుకే దుర్గారావు నిర్దోషి అని ప్రకటించి విడుదల చేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా విచారణ పేరుతో తనను బెదరించి రాయిదాడికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి చేశారని విడుదల అనంతరం దుర్గారావు చెప్పారు. అయితే తాను బలంగా నిలబడ్డాననీ, చేయని నేరాన్ని అంగీకరించేది లేదని స్పష్టంగా చెప్పాననీ దుర్గారావు అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/durgarao-innocent-in-stone-attack-on-jagan-25-174295.html
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.