Publish Date:Mar 12, 2025
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో సోము వీర్రాజుకు బీజేపీ కోటాలో టికెట్ దొరకడం తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసహనాన్ని నింపింది. పార్టీ అధినాయకత్వం మెతక ధోరణి పట్ల తీవ్ర ఆగ్రహమూ వ్యక్తం అయ్యింది. తొలి నుంచీ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించి మిగిలిన నాలుగు స్థానాలకూ తెలుగుదేశం అభ్యర్థులు రంగంలోకి దిగుతారని అంతా భావించారు. తెలుగుదేశం అధిష్ఠానం కూడా అలాగే భావించింది. జనసేనకు కేటాయించిన స్థానంలో నాగబాబు పోటీ చేస్తారనీ, ఆ తరువాత ఆయనను చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకుంటారని దాదాపు ఖరారైపోయింది. అయితే చివరి నిముషంలో బీజేపీ రంగంలోకి దిగి ఒక స్థానానికి పట్టుబట్టింది. పొత్తు ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని తెలుగుదేశం బీజేపీకి త్యాగం చేయాలని భావించింది. అందుకు తెలుగుదేశం నేతలు, శ్రేణుల నుంచి కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ స్థానానికి బీజేపీ హైకమాండ్ సోము వీర్రాజును ఎంపిక చేసిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం శ్రేణులు రగిలిపోయాయి.
క్యాడర్ ఆగ్రహాన్ని, అసంతృప్తినీ, ఆవేదననూ అర్ధం చేసుకున్న మంత్రి లోకేష్.. సోము వీర్రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి శ్రేణులకు ఒకింత ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది కూడా.
ఔను కూటమి తరఫున ఐదు ఎమ్మెల్సీ స్థానాలకూ నామినేషన్లు దాఖలయ్యాయి. తొలుత కొద్ది రోజుల ముందే జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి నారా లోకేష్ హాజరయ్యారు. నాగబాబుతో పాటు ఆయనా ఉన్నారు. ఆ తరువాత తెలుగుదేశం తరఫున ముగ్గురు అభ్యర్థులు బీద రవిచంద్రయాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు మంగళవారం (మార్చి 11) నామినేషన్లు దాఖలు చేశారు. వారి నామినేషన్ దాఖలు కార్యక్రమానికీ లోకేష్ హాజరయ్యారు. ఆ తరువాత మంగళవారం (మార్చి 11) ఇక నామినేషన్ దాఖలుకు గడువు ముగిసిపోతున్నదనగా ఐదో స్థానానికి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ఆ కార్యక్రమానికి మాత్రం లోకేష్ హాజరు కాలేదు. తద్వారా సోముకు ఎమ్మెల్సీకి తాను పూర్తి వ్యతిరేకిననీ, కానీ మిత్రధర్మంలో భాగంగా అనివార్యంగానే అందుకు పార్టీ హైకమాండ్ అంగీకరించాల్సి వచ్చిందనీ చాటారు. సోము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా దూరంగా ఉన్న లోకేష్, ఆసమయంలో సెక్రటేరియెట్ లోనే ఉన్నారు. కానీ సోము నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని అవాయిడ్ చేయడం ద్వారా సోము అభ్యర్థిత్వానికి తాను వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతాన్ని పార్టీ క్యాడర్ కు ఇచ్చారు. ఇది కొంత వరకూ తెలుగుదేశం క్యాడర్ లోనిఅసంతృప్తి, ఆగ్రహ జ్వాలలను ఒకింత చల్లార్చిందనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-keep-distance-from-somu-nomination-39-194276.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.