తెల్లరేషన్ కార్డుదారులకు 202 మద్యం షాపులు
Publish Date:Mar 31, 2012
Advertisement
రాష్ట్రంలో మద్యంషాపులను ఏర్పాటుచేయాలంటే మాటలు కాదు. కోట్లాది రూపాయలు కుమ్మరిస్తే తప్ప మద్యం షాపులు దక్కలేదు. అయితే ఉత్తరాంధ్రలో అతి నిరుపేదలు కూడా మద్యం షాపులను నెలకొల్పగలిగారు. వీరికి ఉండేది తెల్లరేషన్ కార్డులే అయినా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి మద్యం షాపులను వేలంలో పాడుకున్నారు. వినడానికే ఈ విషయం వింతగా ఉన్నప్పటికీ అది పచ్చినిజం. తెలుగువన్.కామ్ సర్వే ప్రకారం ఉత్తరాంధ్రలోని 202 మద్యం షాపులను తెల్లరేషన్ కార్డులు ఉన్న నిరుపేదలు నెలకొల్పారు. వీరిలో 160 మందికి అసలు తమ పేరిట మద్యం షాపులు ఉన్నట్లే తెలియదు. అసలు జరిగిందేమిటంటే బాగా బలిసిన మద్యం వ్యాపారులు తమ పేరుతో షాపులు తీసుకుంటే రకరకాల ఇబ్బందులు రావచ్చుననే భయంతో తమకు తెలిసిన నిరుపేదలను బినామీలుగా పెట్టి వారి పేరిట లైసెన్స్ లు తెచ్చుకున్నారు. ఈ సహాయం చేసినందుకు ఈ బడుగు వర్గాలకు నెలకు నాలుగైదు వేల రూపాయలు జీతంగా ఇచ్చి సంతోషపరుస్తున్నారు. అయితే తెల్లరేషన్ కార్డులున్న నిరుపేదలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎలా లైసెన్స్ లు పొందగలిగారన్న అంశాన్ని ఎక్సైజ్ శాఖ కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎసిబి దాడుల తరువాతే ఈ ప్రహాసనాలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చాలా చోట్ల ఎసిబి దాడుల తరువాతే ఈ ప్రహాసనాలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చాలా చోట్ల ఎసిబి దాడుల తరువాత మద్యం వ్యాపారులు పరారయ్యారు. కానీ వారి బినామీలుగా ఉన్న నిరుపేదలు మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/liquor-syndicate-24-13051.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





