Publish Date:Oct 12, 2019
నేటి విద్యార్ధులే రేపటి భావి భారత పౌరులు అన్నారు పెద్దలు. కానీ ఇప్పటి పరిస్థితులకు మాత్రం విద్యార్ధులనే లక్షంగా చేసుకుంటున్నారు కొందరు. వివరాళ్లోకి వెళ్తే విద్యార్థి నేతల పై నిఘా పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలిక మళ్లీ మొదలైంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులని మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విద్యార్ధులను రెచ్చగొడుతోన్న వివిధ నిషేధిత సంస్థల పై నిఘా పెట్టారు పోలీసు అధికారులు. అంతేకాదు కొందరు అనుమానితులను అదుపులోకి కూడా తీసుకున్నారు.
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యార్ధి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటితో పాటు జగన్, సాయన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు. మరో వైపు విద్యార్ధి నేతలు అనుదీప్, నాగరాజు, రమేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సందీప్, గోపి, ఖాసిమ్ ల పై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేశారు. మావోయిస్టులకు పలు విద్యార్థి సంఘాలు సహకరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో ముప్పై విద్యార్థి సంఘాలను నిషేధించినట్టు తెలిపారు. గత కొంత కాలంగా జగన్ మావోయిస్టులతో టచ్ లో ఉన్నాడనీ మావోయిస్టులకు ఫండ్ ఇవ్వాలనీ కొన్ని కంపెనీల బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
దీంతో జగన్, మద్దిలేటి ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మావోయిస్ట్ నేత హరిభూషణ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. జగన్, మద్దిలేటిపై పూణే కర్ణాటకల్లో కేసులున్నట్లు గుర్తించారు. కొన్ని నిషేధిత మావోయిస్టు సంస్థలు విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని నక్సలిజం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
తుపాకీ పట్టి వయోలెన్స్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. అయితే భారతదేశంలో ఇలాంటి వాటికి స్థానం లేదన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సిపి అంజనీ కుమార్. ప్రభుత్వం ఇటువంటి చర్యల పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/letter-by-top-maoist-found-at-tvv-president-house-25-89991.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.