Publish Date:Oct 12, 2019
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పెద్ద చర్చనీయంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఏం జరగబోతోంది అని అందరిలోనూ ఒక ఆందోళన మొదలైయ్యింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆయన శరీరం తొంభై శాతం వరకు కాలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి ఇరవై ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నారు. టీఎంయూ నేతగా కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన కొద్ది సేపటికే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించారని తోటి కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికులు ఏకంగా యాభై వేల ఉద్యోగులను కేసీఆర్ ఒక్కసారిగా డిస్స్మిస్ చేయడం పట్ల తీవ్రంగా మండి పడుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలు ఖమ్మం డిపో లోని డ్రైవర్ గా పని చేస్తున్నారు. అదే విధంగా టీఎంయూలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సమ్మె పై కేసీఆర్ ప్రసంగించిన తరువాత ప్రెస్ నోట్ ని విడుదల చేసిన వెంటనే తన ఇంటి వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా తొంభై శాతం శరీరం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతానికి అతనిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించినట్లు తెలియజేశారు. దాదాపుగా అన్ని యూనియన్ సంఘాలు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగాను, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుండటమే కాక ఇటువంటి పాలనతో ఎవరిని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరిని కూడా ప్రభుత్వం అణిచివేస్తున్న తీరుకు నిరసనగా ఆందోళన తీవ్రతరం చేస్తామని దీనిని జిల్లా పరంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉదృక్తం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వామపక్ష పార్టీలు, యూనియన్ నేతలు చేరుకున్నారు. దీంతో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి వద్ద చేరుకోవడమే కాక అదనపు బలగాలను కూడా తీసుకొచ్చెందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/khammam-rtc-depot-driver-srinivas-reddy-suicide-attempt-25-89993.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.