గంటల్లో రూ. 2 వందల కోట్లు హాంఫట్! అధికార పార్టీ ముఖ్య నేత డీల్?  

Publish Date:Dec 18, 2020

Advertisement

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చా? కొన్ని గంటల్లోనే వందల కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమా?. మాములుగా అయితే ఎవరికి ఇది సాధ్యం కాదు. కాని రాజకీయ నేతలకైతే అది చిన్న పనిగానే ఉంటుందట. అధికారంలో ఉన్న నేతకు సన్నిహితంగా ఉంటే ఇంకా ఈజీనట. పాలించే నేతకు దగ్గరి బంధువైతే ఇక తిరుగేలేదట. రాత్రికి రాత్రే వందల కోట్ల రూపాయలు ఇట్టే స్వాహా చేయవచ్చట. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదట. మాయా మశ్చీంద్రలు చేయాల్సిన అవసరం రాదట. అలా పలకగానే ఇలా  డబ్బులు వచ్చిపడటానికి అల్లావుద్దీన్ అద్బుత దీపం ఉండాల్సిన అవసరం కూడా లేదట. కేవలం అధికారాన్ని ఉపయోగించి అక్రమ మార్గంలో నిమిషాల్లో  వందల కోట్ల రూపాయలు కొట్టేయవచ్చని తెలుస్తోంది. 

 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇలాంటి దందాలకు అడ్డాగా మారిపోయిందని తెలుస్తోంది. హైదరాబాద్ కు మణిహారంగా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న భూములపై కన్నేసిన బడాబాబులు.. అడ్డదారుల్లో వాటిని రాత్రికి రాత్రే సొంతం చేసుకుంటున్నారట. ఖరీదైన ఏరియాలో భూములున్న వ్యక్తులను గుర్తించి.. తమకున్న అధికారంతో వారిని భయపెట్టి, బెదిరింది లొంగదీసుకుంటున్నారట. అయినా వినకపోతే అ భూములపై వివాదం స్పష్టించి.. పోలీసుల కేసులతో వేధించి తమ దారికి తెచ్చుకుంటున్నారట. అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా వారి దగ్గర కొట్టేసి.. కొన్ని గంటల్లోనే అంతకు పదుల రెట్లకు అమ్ముకుంటూ వందల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి ఘటన ఇటీవలే జరిగిందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేసిన ఓ బడా వ్యాపారి కమ్ రాజకీయ నేతకే మైండ్ బ్లాక్ అయ్యిందట. 

 

మేడ్చల్ జిల్లా పరిధిలో హైదరాబాద్ శివారు అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఆ  బడా వ్యాపారవేత్తకు 3 వందల ఎకరాల భూమి ఉందట. ఆ భూములపై  అధికార పార్టీలోని ముఖ్య నేత బంధువు కన్ను పడిందట. ప్రజాప్రతినిధిగానూ ఉన్న ఆ బడా నేత.. అ వ్యాపారి భూముల కోసం కతర్నాక్ స్కెచ్ వేశారట. పోలీస్ పెద్దలతో కలిసి ఈ తతంగం నడిపించాడట ఆ దొరగారు. దీంతో  రాత్రికి రాత్రే కొత్త సీన్ క్రియేట్ అయిందట.  భూములపై వివాదం ఉందంటూ సదరు బిజినెస్ మెన్ కొడుకును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారట. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లడంతో ఆ వ్యాపారి తనకున్న రాజకీయ పరిచయాలతో అన్ని ప్రయత్నాలు చేశారట. ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేతలతోనూ చెప్పించారట. ప్రస్తుత ఎంపీ, మాజీ మంత్రి పోలీసుల పెద్దలతో మాట్లాడినా పని కాలేదట.  వ్యాపారి కొడుకును విడిపించేందుకు ఫోన్ చేసిన ప్రజా ప్రతినిధులకు పోలీసు బాస్ ల  నుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం.. పై నుంచి ఆర్డర్స్ .. మేం ఏం చేయలేం. విషయం గ్రహించిన బాధిత వ్యాపారి.. చివరికి చేసేది లేక బడానేతతో డీల్ కు ఓకే చెప్పాడట.  వాళ్లు చెప్పినట్లే చేసి తన కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి అర్దరాత్రి ఇంటికి తీసుకెళ్లాడట.  

 

అర్ధరాత్రి ఆ  బడా రాజకీయ నేత జరిపిన ఈ  డీల్ ఎంతో తెలుసా. అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు. మీరు వింటున్నది నిజమే.. ఆక్కడ రాత్రికి రాత్రే జరిగిన డీల్ తో  200,00,00,000 రూపాయలు ఆ ముఖ్య నేతకు అప్పనంగా వచ్చేశాయట.  బాడా నేత కన్నుబడిన వ్యాపారికి సంబంధించిన భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు మూడు కోట్ల రూపాయలు ఉందట. అయితే భూములను కాజేయాలనే స్కెచ్ వేసిన సదరు దొరగారు మాత్రం ఎకరాకి 70 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని మొదట బేరం పెట్టాడట. పోలీసు పెద్దలు, వ్యాపారికి మద్దతుగా నిలిచిన ప్రజా ప్రతినిధుల చొరవతో చివరికి కోటి రూపాయల చొప్పున.. ఈ వ్యాపారికి 3 వందల కోట్లు విదిల్చాడట. కొడుకును విడిపించుకునేందుకు చేసేది లేక 9 వందల  కోట్ల రూపాయల విలువైన భూములను... కేవలం మూడు వందల కోట్లకు ఆ బడా నేతకు అప్పగించి బతుకు జీవుడా అంటూ ఆ వ్యాపారి తన కొడుకును తీసుకుని పోలీస్ చెర నుంచి , ఆ బడా నేత కబంద హస్తాల నుంచి బయటపడ్డాడట.  

 

అత్యంత ఖరీదైన భూములను వ్యాపారి నుంచి అక్రమంగా సొంతం చేసుకున్న ఆ ముఖ్య నేత..  కొన్ని గంటల్లోనే మరో వ్యాపారికి ఆ భూమిని  అమ్మేశాడట. వ్యాపారికి ఎకరాకు కోటి రూపాయలు ముట్టచెప్పిన సదరు నేత..  ఐదు వందల కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించాడట.  అంటే సదరు నేత కేవలం కొన్ని గంటల్లోనే అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు నొక్కేశాడటన్న మాట. హైదరాబాద్ లో జరిగిన ఈ భూ దందా బాగోతం కేంద్రం పెద్దలకు కూడా చేరిందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన రాష్ట్ర పెద్దకు ... ఈ డీల్ వివరాలు చూపించి చుక్కలు చూపించారట కేంద్రం పెద్దలు. ఇంతటి అరాచకాలు జరుగుతుంటో ఏం చేస్తున్నారని క్లాస్ పీకారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని కూడా  ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను కేంద్రం పెద్దలు టేబుల్ పై ఉంచి ప్రశ్నించడంతో.. ఆ రాష్ట్ర పెద్ద నేత సమాధానం చెప్పుకోలేక దిక్కులు చూశారని తెలుస్తోంది. 

 

వినడానికే వింతగా, ఏదో మాయ జరిగినట్లుగా అనిపిస్తున్నఈ ఘటన..  హైదరాబాద్ శివారులో  జరుగుతున్న అక్రమ భూదందాకి  సాక్ష్యంగా నిలుస్తోంది. మాములుగా సినిమాల్లో మనం ఇలాంటి సీన్లు చూస్తుంటాం. తనకు నచ్చిన భూమి కనిపిస్తే చాలు విలన్లు కబ్జా చేసేస్తుంటారు. బలవంతంగా తమకు నచ్చిన రేటుకే కొనుగోలు చేస్తుంటారు. భూ యజమానులు వినకపోతే .. అతన్నో, అతని కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేసి ల్యాండ్ డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుంటూ ఉంటారు. పోలీసులతో కుమ్మక్కై సెటిల్ మెంట్లు చేసుకుంటారు.  అయితే అలా జరగడం సినిమాల్లోనే  సాధ్యమనే భావనే జనాల్లో ఉంటుంది. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ  ఇలాంటి షాకింగ్ ఘటనలు జరుగుతాయని తాజా ఘటనతో  తెలుస్తోంది.  రాజకీయాలతో మంచి సంబంధాలు ఉన్న , ఎన్నికల్లోనూ పోటీ చేసిన వ్యాపారికే దిక్కు లేకుండా ఉంటే ..  మిగితావాళ్ల  పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ శివారులో జరిగిన ఈ భూ మాయాజాలం  ఘటన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కలవరం రేపుతుందని తెలుస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.