ఈ అమ్మమ్మకు శుభాకాంక్షలేవి...లోకేష్‌కి లక్ష్మీ పార్వతి ప్రశ్న...అసలు మతలబు ఏంటి?

Publish Date:Apr 20, 2026

Advertisement

 

లోకేష్ పొరబాటున ఒక తల్లిగా భావించి విజయమ్మ పుట్టిన రోజుకు ఒక ట్వీట్ పెట్టిన పాపానికి అది అటు దిరిగి ఇటు దిరిగి ఎన్నో వివాదాలకు కారణమైంది. కొందరు ఏమన్నారంటే, లోకేష్,, నానమ్మ అమ్మణ్ణమ్మ, తాతయ్య ఖర్జూర నాయుడుకి కూడా ఇలాగే విషెస్ పెట్టాలని కొందరు. మరి కొందరు.. లోకేష్ ఇదే విజయమ్మను గతంలో విజయ విజయ అంటూ గౌరవం లేకుండా మాట్లాడారనీ.. ఇప్పుడు విజయమ్మ అంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమేంటని గత ట్వీట్లు కూడా తిరగదోడి మరీ కామెంట్లు చేశారు.

ఫైనల్ గా రంగంలోకి దిగారు లక్ష్మీపార్వతి. విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పే స్థాయి నీకుందా? అని లోకేష్‌ని  అడుగుతూ.. చాలానే మాటలు మాట్లాడారు. మొన్న మీరు గెలిచింది ఒక గెలుపే కాదు. అన్నీ అడ్డదారులంటూ అవాకులు చెవాకులు మాట్లాడిన లక్ష్మీ పార్వతి చివరాఖర్లో ఒక బాంబు పేల్చారు. మీ అమ్మమ్మను నేను ఉన్నాను. నాకు ఎప్పుడైనా విషెస్ చెప్పావా? అంటూ నిలదీశారామె.

ఏమాటకామాట లోకేష్ విజయమ్మకు పుట్టిన రోజుల శుభాకాంక్షలు చెప్పడంలో ఒక రాజకీయ కోణం ఉన్న మాట నిజమే. ఆమె తన కొడుకు జగన్‌తో  గొడవలేం ఖర్మ ఏకంగా కోర్టు కేసుల్లో ఉన్నారు. తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన జగన్ కాస్తా ఆ రోజు.. ముక్కు సర్జరీ చేయించుకున్న  పవన్‌పై  పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఒక ట్వీట్ చేశారు. 2024 వరకూ తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన జగన్ గత రెండేళ్లుగా అమ్మను మరచి పోయారు. ఈ విషయం గుర్తు చేస్తూ లోకేష్ విజయమ్మ ను కూడా తన అమ్మగా భావించి.. విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. 

ఏ మాటకామాట జగన్ కి పవన్ కి పెద్దగా పడేది కాదు. గత కొన్నాళ్లుగా ఆయన్ను జగన్ దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్ల వాడంటూ మాట్లాడేవారు. అలాంటి పవన్ మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చిన జగన్ తన తల్లిని కూడా మరచి ఆయన వెంటనే కోలుకోవాలంటూ.. ట్వీట్ చేయడం చాలా మందికి షాకింగా అనిపించింది. గతంలో వైసీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది అనే మాట కూడా చెలామణిలో ఉంది. ఈ విషయం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్న మాట నిజం. అయితే ఇదంతా జగన్ కి ఏమంత ఇష్టం లేదు. అంతా కేంద్ర బీజేపీ నాయకత్వం చేసిన యత్నంగా చెబుతారు కొందరు వైసీపీ మద్దతుదారులు. అంత ఇష్టం లేని వ్యక్తి తల్లికన్నా ఎక్కువ ఎలా అవుతారన్నది ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్

ఈ పాయింట్‌ని  ఇన్ డైరెక్టుగా హైలెట్ చేస్తూ జగన్ సోదరి షర్మిళ సైతం ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆమె జగన్ కేంద్రానికి దత్తపుత్రుడిగా మారిపోయారంటూ చేసిన కామెంట్లను అలా ఉంచితే.. తన తల్లి తనకు ఎంతో అండగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇదే అంశాన్ని లోకేష్ సైతం టచ్ చేస్తూ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం జగన్ని బాగా ఇరుకున పెట్టిన అంశంగా మారింది. దీన్నుంచి టాపిక్ డైవర్షన్ చేసే బాధ్యతలను ఆ ఇంటికి కాస్త రిలేషన్  గల లక్ష్మీపార్వతిని రంగంలోకి దించారు వైసీపీ వ్యూహకర్తలు. కట్ చేస్తే ఆమె తనకున్న వేలువిడిచిన అమ్మమ్మ బంధుత్వాన్ని బయటకు లాగి.. ఇదిగో ఇలా అమ్మమ్మ అనే రిలేషన్ ని గుర్తు చేసి తద్వారా.. లోకేష్ ని ఇరుకున పెట్టాలన్న యత్నం చేశారని అంటారు కొందరు విశ్లేషకులు.
 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ట్రంప్ పరిపాలనకు మునీర్ తో ఉన్న సాన్నిహిత్యం కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఒక వ్యూహాత్మక పరీక్షగా మారింది. ఒకవైపు ఇరాన్ తో పరోక్ష చర్చలు సాగుతున్నాయి. మరోవైపు , మునీర్ కు టెహ్రాన్ అగ్ర సైనిక వర్గాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇక్కడ సమస్య మునీర్ మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు. ఆయన ఎవరి తరఫున, ఎంత పారదర్శకంగా, ఎంత నమ్మదగిన రీతిలో మాట్లాడుతున్నారన్నదే అసలు ప్రశ్న.
కోయంబత్తూరు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సగం రోడ్డు వేసి.. మిగతా సగం రోడ్డు వేయకుండా ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజుల్లో రోడ్డు వేస్తారో లేదో తెలపాలనీ, లేని పక్షంలో సీఎం ఆఫీస్ కి వెళ్తామని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం (20-04-2026) అగ్నిప్రమాదం సంభవించింది.
సాధారణంగా అరవై ఏళ్లు దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం సహకరించదని బాధ్యతలను పక్కన పెట్టేస్తుంటారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.
పశ్చిమ జపాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్లు చెబుతున్నారు. భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం జపాన్ లోని ఇషికావా పరిధిలోని నోటో ద్వీపంలో సంభవించింది. దాదాపు నిముషం పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.