Publish Date:Oct 30, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. అజహరుద్దీన్ కి మంత్రి వర్గంలోకి చోటు కల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు కవర్ చేస్తూనే.. అటు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. వారిని మరింత ఆకట్టుకునే యత్నంలో కాంగ్రెస్ ఉంది. అయితే.. అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు... ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్నప్పటి రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఇప్పటి వరకూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ దగ్గరే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవడంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా స్వామికార్యం- అంటే నవీన్ కార్యం కూడా పూర్తి చేయాలన్నది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటిలో మూడింటిని మాత్రమే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆలోచన. ఇప్పుడు అవసరానికి ఇందులో ఒక మంత్రి పదవి బయటకు తీశారు. మిగిలిన రెండింటి పరిస్థితి ఏంటని చూస్తే.. ఇప్పట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.
దీంతో గత కొన్నాళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. అసలీ పార్టీలోనే ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారన్న వదంతి ఒకటి గుప్పు మంటోంది. ఇటు అజహరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారో లేదో కానీ అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపార్టీ వీడేలా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఇలాగే పార్టీ వీడి తర్వాత తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకూ ఆయనకున్న భావప్రకటనా స్వేచ్ఛకు కాంగ్రెస్ లో తప్ప మరెక్కడా వీలు కాదు. కాబట్టి.. ఆయన వెళ్తే వెళ్లాడు-మళ్లీ వచ్చేస్తాడులెమ్మన్నభావనలో అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. మరి చూడాలి ఈ పరిణామ క్రమాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/komatireddt-rajagopalreddy-angry-over-cabinet-39-208710.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.