రాహుల్ గాంధీకి గంతలు కట్టిన కిరణ్

Publish Date:Apr 19, 2013

Advertisement

 

నిన్న డిల్లీలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సమావేశమయిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులతో బాటు, చంద్రబాబు మరియు షర్మిల చేస్తున్నపాదయాత్రల గురించి కూడా వాకబు చేశారు. వారి పాదయాత్రల ప్రభావం ప్రజల మీద ఎలాఉంది? తద్వారా ఆయా పార్టీలకు ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది? దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఏవిధంగా ఉంటుంది? అని రాహుల్ గాంధీ ప్రశ్నించడం చూస్తే వారిద్దరూ పాదయాత్రలు చేస్తూ ఒకవైపు తమ పార్టీలు బలోపేతం చేసుకొంటూనే, మరోవైపు తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేఖతను పెంచుతున్నారని, తద్వారా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు అర్ధం అవుతోంది. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం, రాహుల్ గాంధీ కళ్ళకు కూడా గంతలు కట్టే ప్రయత్నం చేయడం విశేషం.

 

గత 7 నెలలుగా చంద్రబాబు పాదయాత్రల చేస్తున్నపటికీ, ఆయన స్వంత పార్టీ మీద కానీ, ప్రజలమీద గానీ ఆయన ప్రభావం చూపలేకపోయారని, ప్రజలు కూడా ఆయన మాటలు విశ్వసించడంలేదని చెప్పారు. అంతే కాకుండా వారి పార్టీలో, కుటుంబంలోనే కలహించుకొంటున్నారని అందువల్ల ఆ పార్టీ నుండి రాబోయే ఎన్నికలలో తమకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని కిరణ్ స్పష్టం చేసారు.

 

షర్మిలా చేస్తున్న పాదయాత్రల పట్ల కూడా ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. జగన్ అవినీతి గురించి, అక్రమార్జన గురించి క్రమంగా ప్రజలు కూడా నమ్మడం మొదలుపెట్టారని అందువల్ల వైయస్సార్ కాంగ్రెస్ వల్ల కూడా తమకొచ్చే నష్టం ఏమిలేదని ఆయన వివరించారు.

 

తానూ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల గురించి వివరించి, త్వరలో మరి కొన్ని పధకాలు ప్రవేశ పెట్టబోతున్నట్లు కూడా తెలిపారు. తానూ ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పధకాల వల్ల రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని, అది వచ్చే ఎన్నికల నాటికి పూర్తి అనుకూల వాతావరణం సృష్టించడం ఖాయమని గట్టిగా భరోసా ఇచ్చారు.

 

ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం చూస్తే, రాష్ట్రప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టబోతున్నారని అర్ధం అవుతుంది. కానీ, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తికయినా ఆయన స్వయంగా ఆత్మవంచన చేసుకొంటూ, తమ అధినేతను కూడా మభ్యపెడుతున్నారని అర్ధం అవుతుంది. ఇద్దరు ప్రతిపక్ష నాయకులు కలహించుకొంటున్నపటికీ, ఇద్దరూ కూడా గత 6నెలలుగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల గురించి,అవినీతి గురించి ప్రజలకు అర్ధమయ్యే విధంగా సోదాహరణగా వివరిస్తుంటే, ఆ ప్రభావం అసలు ప్రజల మీద ఉండబోదని నమ్మించే ప్రయత్నం చేయడం భ్రమలో బ్రతకడమే అవుతుంది.

 

ఇక ఒకవైపు ఎన్ని పధకాలు ప్రవేశ పెడుతున్నపటికీ, మరో వైపు కరెంటు కోతలు, తద్వారా ఎండుతున్న పంటలు, కుంటుపడిన పరిశ్రమలు , దివాలా తీస్తున్న వ్యాపారాలు, తద్వారా పెరుగుతున్న నిరుద్యోగం వంటివి ఆయన తమ అధినేతకు చెప్పకుండా కేవలం తన పధకాల గురించి మాత్రమె చెప్పుకోవడం ఆయన కళ్ళకు గంతలు కట్టడం కాక మరేమిటి?

 

గతంలో ఏ ఆరు నెలలకో, ఏడాదికో పెరిగే కరెంటు బిల్లులు ఇప్పుడు ప్రతీ నెలా పెరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ, వారు తను ప్రవేశ పెడుతున్న సంక్షేమ పదకాలను చూసి ఐస్’ అయిపోయి తమకే గంప గుత్తగా ఓట్లేసి గెలిపించేస్తారని భావించడాన్ని ఏమనుకోవాలి?

 

ఇక, ప్రజాగ్రహం సంగతి పక్కన పెట్టినా, తెలంగాణలో తెరాస ప్రభావం, ఆంధ్రాలో తెదేపా, జగన్ ప్రభావం అసలు ఉండబోదని అనుకోవడం భ్రమ కాదా? రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కాకపోవచ్చును. కానీ, తెరాస, తెదేపా, మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ మూడు పార్టీలు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేయకమానవు. వీటికి అదనంగా రాష్ట్రంలో ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడుతున్న కులం, ప్రాంతం, ధనం మొదలయిన వాటి ప్రభావం ఎన్నికలపై ఉండనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని లుకలుకలు, ముఠాలు మరే పార్టీలోను కనబడవని లోకోక్తి ఉండనే ఉంది.

 

ఇన్ని అంశాలు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంటే మరి రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో చాలా హాయిగా బ్రతుకుతున్నట్లు, రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రభావం అసలు ఏమిలేనట్లు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా నమ్మడమే కాకుండా, తమ పార్టీ అధినేతకు కూడా చెప్పడం చూస్తే, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆయనే శల్యసారద్యం చేస్తున్నారని భావించవలసి ఉంటుంది. నిద్ర పోయే వారిని లేపోచ్చు కానీ, నిద్ర నటించే వారిని లేపడం ఎవరి తరం?

By
en-us Political News

  
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.