ఆ నలుగురూ...

Publish Date:Jun 3, 2014

Advertisement

 

రాజకీయనేతల అందరి రాజకీయ జీవితాలలో ఒడిడుకులు సహజమే. కానీ ఒకేసారి రివ్వున పైకెదిగి, అంతే వేగంగా పడిపోయిన వారి సంఖ్య వ్రేళ్ళ మీద లెక్కబెట్టవచ్చును. అటువంటి వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల పేర్లను ప్రముఖంగా చెప్పుకోవచ్చును.

 

ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, తన మూడేళ్ళ పాలనలో ఒక వెలుగు వెలిగారు. తన మంత్రి వర్గ సహచరులను కానీ, ప్రతిపక్ష నేతలను గానీ ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని అనుకరించబోయి వాతలు పెట్టుకొన్నారు. తన మూడేళ్ళ పాలనలో పార్టీలో వారిని, బయట వారినీ, చివరికి అధిష్టానాన్ని అందరినీ కూడా శత్రువులుగా మార్చుకొన్న ఘనత ఆయనకే స్వంతం. అయితే ఆయన రాష్ట్ర విభజన అంశం తలకెత్తుకొన్నాక ప్రజలలో కొంత మంచి పేరు సంపాదించిన మాట వాస్తవం. కానీ, ఆయనే అధిష్టానానికి సహకరిస్తూ దగ్గరుండి రాష్ట్ర విభజన చేస్తూ, ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించడం మొదలు పెట్టిన నాటి నుండి ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఆ సంగతి గమనించకుండా పార్టీ పెట్టి ఉన్న పరువు కూడా తీసుకొన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఏమి చేస్తున్నారో అంతకంటే తెలియదు.

 

ఇక జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులు, జైలు జీవితం అనుభవించినప్పటికీ ఆయనకు ప్రజాధారణ తరగలేదు. స్వర్గీయ వైయస్సార్ చేప్పట్టిన సంక్షేమ కార్యక్రమాలే జగన్ కు శ్రీరామరక్షగా నిలిచాయి. ఆయన ఆకస్మిక మరణంతో ప్రజలలో జగన్ పట్ల సానుభూతి పొంగిపొరలింది. దానిని జగన్ బాగానే ఒడిసిపట్టి, చాలా భద్రంగా ఐదేళ్ళు కాపాడుకొచ్చినప్పటికీ, ఎన్నికలలో ఆ సానుభూతిని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. పోలింగ్ జరిగేరోజు వరకు కూడా అన్ని సర్వేలు వైకాపాయే భారీ మెజార్టీతో గెలుస్తుందని బల్లగుద్ది చెప్పినప్పటికీ వైకాపా ఓడిపోయింది. అందుకు కారణాలు అనేకం. అవేమిటో ప్రజలకు బాగానే తెలుసు. భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, మోడీ ప్రధాని బాధ్యతలు చెప్పట్టగానే ఆయనను మంచి చేసుకోవడానికి డిల్లీకి పరుగులు పెట్టడం చూస్తే జాలి కలుగుతుంది. ఇక మరో ఐదేళ్ళు తన పార్టీని, తనను తాను కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి కత్తి మీద సామువంటిదే.

 

ఇక ఆమాద్మీ పార్టీ పెట్టిన ఏడాదిలోనే డిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన అరవింద్ కేజ్రీవాల్, కేవలం 49రోజులలోనే తనంతట తానే అధికారం వదులుకొన్నారు. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురతాననట్లు డిల్లీని పాలించలేని ఆయన దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో పోటీచేసి దేశాన్ని ఏలేందుకు సిద్దమవడం ప్రజలు ఆమోదించలేకపోయారు. అందుకే ఆయన ప్రజల చేతిలో చెంపదెబ్బలు తిన్నారు, అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నికలలో భంగపడ్డారు. ఆ తరువాత మళ్ళీ డిల్లీ పీఠం ఎక్కే ప్రయత్నం చేసారు. కానీ కాంగ్రెస్ మద్దతు నిరాకరించడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు.

 

అప్పుడే ఆయన తనకు జ్ఞానోదయం అయినట్లుగా “ప్రజలు అప్పగించిన అధికారం అర్దాంతరంగా వదిలిపెట్టినందుకు డిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పుకొని, మళ్ళీ అధికారం ఇస్తే ఈసారి ఐదేళ్ళు పాలిస్తానని” వేడుకొన్నారు. దానికి డిల్లీ ప్రజల నుండి కనీస స్పందన కూడా కరువయింది. ఈ అవమానాలు చాలవన్నట్లు బీజేపీ నేత నితిన్ గడ్కారీపై చేసిన అవినీతి ఆరోపణలు చేసినందుకు కోర్టు గడప ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన వివేకం ఏమయిపోయిందో తెలియదు. కోర్టు ఆయనకు రూ.10 వేలు పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసేందుకు సిద్దపడినా, ఆయన నిరాకరించి తీహార్ జైలు చిప్పకూడు రుచి చూసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు చెల్లించి బెయిలు తీసుకోవడం నవ్వు తెప్పిస్తుంది.

 

ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ ఓటమి తరువాత పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీలో సీనియర్ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బహుశః మరి కొద్ది రోజులలలో ఆమాద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే మిగిలినా ఆశ్చర్యం లేదు. వాపును చూసి బలుపు అనుకోవడం వలన తిప్పలే ఇవ్వనీ.

 

ఇక యువరాజవారు రాహుల్ గాంధీకి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మాజీ ప్రధాని మాన్మోహన్ సింగుతో సహా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఆయనకు దాసోహం అన్నప్పటికీ, కాంగ్రెస్ స్వీయ తప్పిదాల కారణంగా ఎన్నికలలో ఓడిపోయింది. దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలుగన్న ఆయన, ఆ నిర్ణయం తీసుకోవడంలో ఏకంగా 10 ఏళ్ళు జాప్యం చేయడంతో ఘోర తప్పిదం చేసారు. దేశానికి ప్రధాని కావాలనుకొన్న ఆయన ఇప్పుడు కనీసం పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించేందుకు కూడా వెనకాడటం చూస్తే ఆయన ఎటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారో అర్ధమవుతుంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని సమర్ధంగా అభివృద్ధిపధంలో నడిపించగలిగితే, ఇక రాహుల్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారడం తధ్యం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.