రైతుల రుణమాఫీలపై కూడా రాజకీయాలేనా?

Publish Date:Jun 5, 2014

Advertisement

 

రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచేందుకు అనేక వాగ్దానాలు చేయడం పరిపాటి. గతంలో అయితే వాటిని ప్రజలు కూడా అంతగా పట్టించుకొనేవారు కాదు గనుక రాజకీయ పార్టీలు అధికారంచెప్పట్టగానే తమ హామీలను చెత్తబుట్టలో పడేసేవి. కానీ, ఇప్పుడు ప్రజలలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పైగా డజన్ల కొద్దీ న్యూస్ ఛానళ్ళు అధికార పార్టీ చేసిన వాగ్దానాల సాధ్యాసాధ్యాల గురించి చాలా లోతయిన విశ్లేషణలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను కూడా మరింత అప్రమత్తం చేస్తున్నాయి. అంతేగాక అవి ప్రభుత్వాలను నీడలా వెంటాడుతూ వాటిని అమలు చేయకపోయినా, వాటిపై వెనక్కి తగ్గినా ప్రజా సమక్షంలో తూర్పారబడుతున్నాయి.

 

ఇక ఎన్నికలలో ఓటమిపాలయిన పార్టీలు ఆ దుగ్ధతో అధికారం చేపట్టిన పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలుచేయాలని గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. జవాబుదారీతనం అలవాటులేని మన రాజకీయ వ్యవస్థలో ఈ మార్పు ప్రజలకు మేలుచేసే ఒక శుభపరిణామంగా భావించవచ్చును. అందువల్ల ఇకముందు రాజకీయ పార్టీలు నోటికి వచ్చిన హామీలు గుప్పించే సాహసం చేయడానికి వెనుకంజవేయవచ్చును.

 

అధికారం దక్కించుకొనేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎంత కష్టమో మొట్టమొదటిసారిగా అధికారం చేప్పట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి ఇపుడిపుడే అర్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో రైతుల  రుణాలు మొత్తం మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్, ఇప్పుడు కేవలం 2013-14సం.లలో తీసుకొన్న లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, వ్యవసాయం కోసం రైతులు బంగారు వస్తువులు బ్యాంకులలో తాకట్టుపెట్టి తెచ్చిన రుణాలను మాఫీ చేయలేమని చేతులెత్తేసారు. ఈ సరికొత్త షరతులతో కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయల రుణభారం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు అప్పుడే ప్రతిపక్షాలు, మీడియా కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం ఆరంభించాయి. మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఈవిధంగా ప్రయత్నించడంతో ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం తలుచుకొంటే మొత్తం రుణాలు మాఫీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అందుకు ఇష్టపడలేదు. అందుకే విమర్శలు ఎదుర్కొంటోంది.

 

మిగులు బడ్జెట్ తో ఉన్నతెలంగాణా ప్రభుత్వమే ఆవిధంగా వెనకాడుతునప్పుడు, ఇక ఉద్యోగులకు జీతాలు కూడా ఈయలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా రూ.54,000 కోట్ల రుణాలను మాఫీ చేయగలరు? అనే ప్రశ్న తలెత్తడం సహజం. అందుకే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడెపుడు అధికారం చేపడుతుందా?రుణాల మాఫీపై చంద్రబాబుని ఏవిధంగా ఇరుకున పెడదామా? అని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, వైకాప నేతలు కూడా చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుకి ఇక ‘కౌంట్ డౌన్’ మొదలయిందని జగన్ అనడం చూస్తే, ఈవిషయంలో ఆయన ఎంత ఆత్రంగా ఉన్నారో అర్ధమవుతోంది.

 

తెలంగాణాలో అయినా, ఆంధ్రప్రదేశ్ లో అయినా ప్రభుత్వాలు అన్నదాతలను ఆదుకోవాలని ప్రయత్నించాలి. అందుకు ప్రతిపక్షాలు కూడా అన్నివిధాల సహకరించాలి. ఎన్నికలలో ఓడిపోయిన రాజకీయ పార్టీలు, మీడియా ముందుకు వచ్చి ఇకపై నిర్మాణాత్మకమయిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయి, అధికారా పార్టీ ఇచ్చిన హామీల గురించి నిలదీయడం మొదలుపెడతాయి. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నాకూడా ప్రజాసంక్షేమం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్ప, ఆపేరుతో రాజకీయాలు చేయడం సమర్ధనీయం కాదు. ప్రబుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నప్పుడు, బాధ్యతగల ప్రతిపక్షం పార్టీగా ముందుగా ప్రభుత్వానికి తగిన  సలహాలు సూచనలు ఇవ్వాలి. అప్పటికీ  ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో వెనుకంజ వేస్తే, అప్పుడు తప్పకుండా నిలదీయవచ్చును. కానీ ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయితే చాలు, వాటిని ఇరుకున పెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి తామేదో ఘనకార్యం సాధించినట్లు సంతోషపడాలనుకోవడం వికృతానందమే తప్ప మరొకటి కాదు. అన్నదాతల సమస్యలను మానవతా దృక్పధంతో చూడకపోగా, వాటిని కూడా రాజకీయం చేసి లబ్దిపొందాలనుకోవడం పైశాచిక (సాడిస్ట్) ఆలోచనే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.