Publish Date:Apr 16, 2024
జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేశినేని చిన్న ఆర్యవైశ్య సమాజం మద్దతు పలికిన వారే అధికారంలోకి వస్తారన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ మాయమాటలకు అందరూ మోసపోయారన్నారు. అండగా ఉటాడని గెలిపిస్తే జనగ్ జే ట్యాక్స్ విధించి వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బందులకు గురి చేశారని, రాష్ట్రానికి ఏ కంపెనీ రాకుండా అభివృద్ధిని అడుడకున్నారని విమర్శించారు. ఆర్యవైశ్యులకు వ్యాపారాలు జరగకుండా ఇబ్బందులకు సృష్టించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా నిలిచి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే జే ట్యాక్స్ రద్దౌతుందని కేశినేని చిన్ని అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు గత 20 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘం సమస్యలు పరిష్కరించలేదని, తన ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం పార్టీలు మారుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని వాడుకున్నారని విమర్శించారు. ఆ వ్యక్తి ఇక్కడ గెలవడని పక్క నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడకు కొత్త అభ్యర్థిని తీసుకు వచ్చారు. సుజనా చౌదరి దెబ్బకు ఆ వ్యక్తి ఓడిపోవడం ఖాయమని చిన్ని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, యువత భవిత కోసం కూటమికి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదన్న ఆయన రాష్ట్రంలో జగన్ పాలనపై అందరూ విసిగిపోయారని అన్నారు. సుజనా గెలుపుతో వెస్ట్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సుజనాచౌదరి వెనకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకోవ టం ఈ ప్రాంతం అదృష్టంగా కేశినేని చిన్ని అభివర్ణించారు. వెస్ట్ నియోజకవర్గాన్ని సుజనాచౌదరి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉందన్నారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో తాను కూడా నడుస్తానన్నారు.
మోడీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సుజనాచౌదరి ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలం గుర్తుపై ఓటువేసి సుజనాచౌదరిని అసెంబ్లీకి పంపిం చాలని, పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్టా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.ఎస్.బేగ్, ఏపీ మర్చంట్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, దుర్గగుడి ఆలయ మాజీ చైర్మన్ పైలా సొమినాయుడు, తమ్మలపాటి శ్రీనివాస్, గుంట్ల రాము, కోణిజేటి రమేష్తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kesineni-chinni-call-defeat-ycp-25-173980.html
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.