Publish Date:Apr 16, 2024
543వ డివిజన్ లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం
కమలం గుర్తు, సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్ధన
కేశినేని వెంకట్, యలమంచిలి కార్తీక్ కి అపూర్వ స్వాగతం
వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులపాలు చేసి ప్రజల నెత్తిమీద భారం మోపాడు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన పని ఒక్కటే..ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మాట తప్పటం..మాట తప్పే నైజం గల జగన్..ఇదొక్కటి మాత్రమే ఖచ్చితంగా చేశాడని టిడిపి యువనాయకుడు కేశినేని వెంకట్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి కేశినేని శివనాథ్ గారి తనయడు వెంకట్, బిజెపి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి సుజాన చౌదరి గారి తనయుడు యలమంచిలి కార్తీక్ కలిసి పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం ఉదయం 53వ డివిజన్ లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జెండా సెంటర్ నుండి మొదలైన ఈ ప్రచారం ఆ ప్రాంతంలోని పలు వీధుల్లో ఎన్డీయే కూటమి కార్యకర్తల మధ్య భారీగా సాగింది.
ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కేశినేని వెంకట్ అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయబోయే అభివృద్ది పనుల గురించి చెప్పారు. విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే...ఎటువంటి ప్రణాళికలు, అభివృద్ది ఆలోచనలు లేని నాయకుడు జగన్ అని వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయటంలో...ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంలో చంద్రబాబు గారు చెప్పిందే కాదు..,చెప్పనవి కూడా చేస్తారన్నారు.
ఎన్డీయే అభ్యర్ధుల్ని గెలిపించేందుకు పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ ఓటు కమలం గుర్తుపై , పార్లమెంట్ ఓటు సైకిల్ గుర్తు పై వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రావూరి సత్యనారాయణ, నియోజకవర్గ మైనార్టీ కార్యదర్శి ఇమ్రాన్, తెలుగు మహిళ నాయకురాలు లక్ష్మీ, జనరల్ సెక్రటరీ మధుతో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-nature-to-slur-words-25-173982.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.
‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు
ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.