Publish Date:Apr 20, 2024
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి, ప్రస్తుతం తిహార్ జైల్లో వున్నారు. జైల్లో వున్నప్పటికీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న కేజ్రీవాల్ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఇదిలా వుంటే, కేజ్రీవాల్కి ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. కేజ్రీవాల్కు మధుమేహం వుంది. కేజ్రీవాల్ ఇంటి నుంచి మామిడిపళ్ళు, అరటిపళ్ళు, పూరీ, స్వీట్లు తెప్పించుకుని తింటున్నారని, దానివల్ల ఆయన శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ రెట్టింపు అయ్యాయని ఈడీ చెబుతోంది. శరీరంలో సుగర్ని పెంచుకోవడం ద్వారా అనారోగ్యాన్ని పెంచుకుని, ఆ కారణాలు చూపించి బెయిల్ పొందాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా ఈడీ ఆరోపిస్తోంది.
ఇదిలావుంటే, కేజ్రీవాల్ను జైల్లోనే చంపడానికి కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. గ్లూకో్జ్ లెవల్స్ పెరిగిపోయిన కేజ్రీవాల్కి ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని, దీనివల్ల ఆయన ఆరోగ్యం మీద ప్రభావం పడి, నెమ్మదిగా మరణించేలా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్కు ఇన్సులెన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రెండు మూడు నెలల పాటు ఆయన్ని ఇలాగే జైలులో వుంచి, ఆ తర్వాత విడుదల చేసినా ఏమాత్రం ప్రయోజనం వుండదు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-dead-plan-39-174230.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.