వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్న ప్రొ. నాగేశ్వర్!

Publish Date:May 3, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాజకీయ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమేసినప్పటికీ, తెలంగాణ నాయకులకు, మేధావులకు ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కడలేని ఆసక్తి. ఆంధ్ర నాయకులు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ, తెలంగాణ నాయకులు, మేధావులు మాత్రం ఆంధ్ర రాజకీయాల గురించి కామెంట్ చేస్తూ తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ వుంటారు. అలాంటి వారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకరు. 

దేశంలో ఎక్కడైనా రైతుల భూమి హక్కు పత్రమైన పట్టాదార్ పాస్ పుస్తకం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? ఐదేళ్ళపాటు పాలించే ముఖ్యమంత్రి ఫొటో శాశ్వతంగా వుండే పాస్ బుక్ మీద వుంటుందా? రైతుల సొంత భూమి పాస్ పుస్తకాల మీద ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? వుండదు.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మాత్రం ఆ ఖర్మ పట్టింది. తమకు వారసత్వంగా వచ్చిన లేదా తాము శ్రమించి సంపాదించుకున్న భూమి తాలూకు పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో చూసి తరించాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర అసంతృప్తితో వున్నారు. రెండ్రోజుల క్రితం సీఎం సతీమణి భారతి పులివెందులలో ప్రచారానికి వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్త కూడా అయిన ఒక రైతు ఆమె ముందు బహిరంగంగానే ఈ విషయం మీద నిరసనను వ్యక్తం చేశారు. అలాంటి పాస్ బుక్ మీద జగన్ ఫొటో వ్యవహారం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ బాధ్యతా రాహిత్యంగా, కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించారు.  పట్టాదార్ పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫొటో వుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నా భూమి పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో ఏంటి అంటే కుదరదని అన్నారు. నా బర్త్ సర్టిఫికెట్ మీద ఎమ్మార్వో సంతకం ఏంటని అడుగుతామా.. ఇది కూడా అంతే అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నాగేశ్వర్ ఎంత వితండవాదన చేశారంటే, మళ్ళీ జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే, నాగేశ్వర్‌ని పిలిచి మరీ పదవి ఇచ్చేంత స్థాయిలో వాదించారు. ఎవరి బర్త్, డెత్ సర్టిఫికెట్ మీదో ఎమ్మార్వో సంతకానికి లేని అభ్యంతరం పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటోకి ఎందుకని అన్నారు. విద్యాధికుడు అయిన నాగేశ్వర్ మాట్లాడుతున్న ఈ మాటల్లో ఆయన స్వార్థమేదో తొంగి చూస్తోంది తప్ప మరింకేం కనిపించడం లేదు.

సరే, అది నాగేశ్వర్ అభిప్రాయం అని ఊరుకోవచ్చు. కానీ, ఇదే నాగేశ్వర్ కొద్ది రోజుల క్రితం పట్టాదర్ పాసు పుస్తకాల మీద జగన్ ఫొటోలు ముద్రించుకోవడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. మరి ఆయనే ఇప్పుడు తాను చేసిన వాదనకు పరస్పర విరుద్ధంగా వున్న వాదన ఎందుకు చేశారో, ఏ గూడుపుఠాణీ జరిగిందో!

By
en-us Political News

  
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.