తెలుగు వారి లోగిళ్లలో పూసిన పున్నాగ పరిమళం
Publish Date:Jul 4, 2013
Advertisement
తెలుగు సినీ సంగీత ఆకాశంలో మెరిసిన స్వరతార ఆయన జామురాతిరి అలసిన మనసులకు జాబిలమ్మ కిరణం మౌనంగానే ఎదగమని చెప్పిన మొగ్గలోని లాలిత్యం కోట్లాది ప్రజలను ఊరించి, ఊగించి, ఉత్తేజపరిచి, ఉల్లాస డోలికల ఆడిస్తున్న ఓ సంగీత సరస్వతి ఆయన.. శాస్త్రీయ సంగీతంలో స్వరరాగమే ఆయన పేరుగా ఉండటం కాకతాళీయమే అయినా దాన్ని సార్ధకం చేసుకున్న కారణ జన్ముడాయన.. సంగీత ధ్వనిని తన అణువనువునా నింపున్న కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి..
తెలుగు సంస్కృతి సాగరంలో వెలసిన సంగీత దీవి ఆయన
తెలుగు వారి లోగిళ్లలో పూసిన పున్నాగ పరిమళం
గాలిని సైతం గాంథర్వం చేయగల హృదయ మేళనం
ఆయనే తెలుగు స్వరాల సుస్వరవాణి కీరవాణి
ప్రస్థుతం స్వర తరంగమై ఎగసి పడుతున్న కీరవాణి 1961 జూలై 4న జన్మించారు.. చిన్ననాటి నుంచే సంగీతంపై ఉన్న మక్కువతో ఎలాగైన ఆ రంగంలో పరిణతి సాదించాలనుకున్నారు.. అందుకే 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా చేరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు..
తొలిసారిగా ఉషాకిరణ్ మూవీస్ వారు తెరకెక్కించిన మనసు మమత సినిమాతో 1989లో సంగీత దర్శకునిగా మారారు కీరవాణి.. ఆ తరువాత వరుసగా సంగీత దర్శకునిగా అవకాశాలు వస్తున్న కీరవాణి అనుకున్న స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు.. రామ్గోపాల్ వర్మ, నాగార్జున లాంటి వారితో భారీ సక్సెస్లు అందించినా అవేవి ఆయనకు స్టార్డమ్ను సాధించి పెట్టలేదు..
కీరవాణి కీర్తిని జాతీయస్థాయిలో ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమా అన్నమయ్య..నాగార్జున రాఘవేంద్రరావుల కాంభినేషన్లో వచ్చిన ఈ సినిమా విజయంలో కీరవాణి పాత్ర ఎంతో ఉంది.. అన్నమయ్య పదాలకు మరింత అందాన్ని చేకూర్చేలా తన బాణీలతో రంగులద్దిన కీరవాణి ఆ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు..
అంతేకాదు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు.. ఎనిమిది నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్న అరుదైన రికార్డ్ కీరవాణి సొంతం..
కేవలం తెలుగులోనేకాదు తమిళ, మళయాల భాషల్లోనూ కీరవాణి ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నారు.. అంతేకాదు తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకునేలా ఉత్తరాదిలో కూడా తన సంగీతం జయ కేతనం ఎగురవేశారు కీరవాణి..
దాదాపు 200 లకు పైగా సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి ఇప్పటికీ తన పాటల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.. తనతో పాటు తన వారసులుగా ఎమ్ ఎమ్ శ్రీలేఖ, కళ్యాణిమాళిక్ లాంటి సంగీత దర్శకులను తెలుగు తెరకు అందించారు..
ఇప్పటికీ తెలుగు సినిమాకు తన స్వరాలతో పాటల పట్టం కడుతున్న కీరవాణిగారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తెలుగువన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆయన సంగీత ప్రయాణం మరింత కాలం ఇలాగే కొనసాగాలని మనల్ని అలరించాలని ఆశిద్దాం..
http://www.teluguone.com/news/content/keeravani-birthday-32-24064.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





