Publish Date:Apr 24, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేబినెట్ పునర్వ్యవస్థీరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి సరికొత్త టీమ్ తో సిద్ధం అవ్వాలని భావిస్తున్నారా? ఏరి కోరి తాను తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా అదే చెప్పారా? ఇప్పుడు తెరాస వర్గాలలో విస్తృతంగా నడుస్తున్న చర్చ అదే. రెండు దఫాలుగా అంటు 2014, 2018 ఎన్నికలలో విజయం తరువాత ఆయన కేబినెట్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు మూడో సారి ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో టీమ్ ను మార్చుకోవాలని, వీలైతే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి అవసరం ఉందనీ ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించనట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే టీమ్ జరిపిన రహస్య సర్వేలలో పలువురు మంత్రులపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్లు తేలందని చెబుతున్నారు.
సర్వేల వ్యవహారం పక్కన పెడితే ఇటీవలి కాలంలో పలువురు మంత్రులు వివాదాలలో ఇరుక్కుని ప్రతిష్టను మసకబార్చుకోవడం, ఆ ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందన్న భావనలో ఉన్న కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఇదే తరుణమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై తనకు సన్నిహితులతో ఒక దఫా చర్చించినట్లు కూడా చెబుతున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలికి....వారి స్థానంలో ఉత్సాహంగా పని చేసే యువకులను నియమంచాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంటలు సృష్టించిన నేపథ్యంలో తెలంగాణలో కేబినెట్ లో మార్పులు, చేర్పులూ అనగానే సహజంగానే
అందరిలో ఉత్కంఠ, ఆసక్తి నెలకన్నాయి. ఎన్నికల ముంగిట కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ కసరత్తుకు కారణం ఈ కేబినెట్ టీమ్ తో ఎన్నకలకు వెళితే నష్టం ఉంటుందన్న భావనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కేబినెట్ లోని కొందరు మంత్రులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. వివాదాలలో ఇరుక్కున్న వారూ ఉన్నారు. వారి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలలో తేలంది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వివాదాల మంత్రుల కారణంగా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నదనీ, అటువంటి వారిని ఇంకా మంత్రులుగా కొనసాగిస్తే అది ఎన్నికలలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-to-go-for-vabinet-reshuffle-25-134881.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.