నేరాల్లో టీఆర్ఎస్ నేతలు- పార్టీపై వ్యతిరేకతకు బాటలు

Publish Date:Apr 24, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు నేరాలలో ప్రమేయం ఉన్న సంఘటనలు వెలుగులోనికి రావడంతో రాష్ట్రంలో ఆ పార్టీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
అసలు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఎలాంటి నేరాల్లో బయటపడిందో ఒక సారి చూస్తే...అధికారం అండతో వారెంతగా బరితెగించారో అర్ధమౌతుంది. ఉదాహరణకు...ఓ నాలుగు సంఘటనలను ప్రస్తావిస్తే...
 నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్‌ 8వ తరగతి చదివే ఓ 15 ఏళ్ల  మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పరారీలో ఉన్న అతడి కోసం నిర్మల్ పోలీసులు గాలిస్తున్నారు. ఇటు తెరాస పార్టీ నుంచి సాజిద్ ఖాన్ ను బహిష్కరించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలస్యంగా వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ‌ కుటుంబం సామూహిక ఆత్మహత్య సంఘటనలో సాక్షాత్తూ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనలో  మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పులపాలైన రామకృష్ణ  ఆత్మహత్య వెనుక ఎమ్మెల్యే కుమారుడున్నారనే ఆరోపణలున్నాయి.

మరో ఘటనలో రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు గత ఏడాదిన్నరగా తమను వేధిస్తున్నారని పేర్కొంటూ  లైవ్లో సెల్ఫీ వీడియో తీసుకుని  పెట్రోల్ పోసుకుని తల్లీ కుమారుడు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

 మరో ఘటనలో పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ  బీజేపీ మజ్దూర్ సంఘ్  ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప  మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సాయి గణేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. ఇవే కాకుండా ఇంకా పలు సందర్భాలలో  ఆర్థిక, లైంగిక వేధింపులు, కబ్బాల వివాదాల్లో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. 
రాష్ట్రంలో    టిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర వివాదాల్లోకి తలదూర్చుతున్నారనడానికి  ఇవి కొన్ని ఉదాహరణలు.  ఇటువంటి నాయకుల కారణంగా రాష్ట్రంలో  టిఆర్ఎస్ పై, ఆ నాయకులపై   తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. అసహనం వ్యక్తమవుతోంది.  ఇటువంటి వారి వల్ల ప్రజలలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. అధికారంలో ఉన్న పార్టీ అండదండలు మెండుగా ఉండటంతోనే నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు టిఆర్ఎస్ పాలనపై రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉండగా, కొందరు పార్టీ నాయకుల తీరు పార్టీకి మరింత చెడ్డపేరు తెచ్చిపెడుతోంది.  
గత జనవరి   ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకూ అంటే నాలుగు నెలల వ్యవధిలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చిన నాలుగు తీవ్ర నేర సంఘటనలు జరిగాయి. 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధింపులకు గురి చేయడం,  తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీకి చెందిన యువ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడేలా వేధించడం. ఈ నాలుగు ఘటనల్లోనూ  టిఆర్ఎస్ నాయకులకుప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం, ప్రమేయం ఉండటతో ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంలో పార్టీపై ప్రతికూలంగా పడిందనడంలో సందేహం లేదు.    ఇప్పటికీ కోర్టు నోటీసులు పంపినా మంత్రి పువ్వాడపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇక మరి కొన్ని సంఘటనల్లో సంబంధితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉన్న కేసులలో పోలీసుల దర్యాప్తు నమమాత్రంగా సాగుతోందనీ, నిందితులను పట్టుకోవడంలో వారు ఏ మాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.