జ్యోతిషం నేర్చుకున్న కేసీఆర్

Publish Date:Apr 17, 2024

Advertisement

పదేళ్ళపాటు ఇష్టారాజ్యంగా నడిపించిన అధికారం పోయింది. బాత్రూమ్‌లో జారిపడ్డట్టు ఆడిన నాటకం పుణ్యమా అని ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో బోలెడంత రెస్టు దొరుకుతోంది. ఫామ్‌హౌస్‌లో సాధారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వేళలోనే వుంటాయి. అధికారంలో వున్నా, లేకపోయినా పార్టీ నాయకులెవరైనా పిలిస్తే ఫామ్ హౌస్‌కి వెళ్ళాలి తప్ప వాళ్ళంతట వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. దాంతో పింక్ దొరకి పగలంతా ఖాళీనే. ఈ ఖాళీని సద్వినియోగం చేసుకుంటూ కేసీఆర్ జ్యోతిషం నేర్చుకున్నట్టు అనిపిస్తోంది. తన జ్యోతిష ప్రవేశాన్ని, పరిజ్ఞానాన్ని పదునుపెట్టుకునే ప్రాక్టీసులో భాగంగా కేసీఆర్ భవిష్యత్తును ఊహించి చెబుతున్నారు. 
కేసీఆర్ ఊహిస్తున్న దాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా వుండే పరిస్థితి కనిపించడం లేదట. ఆయనకి అలా ఎందుకు అనిపిస్తోందో మాత్రం ఈ సిద్ధాంతి చెప్పడం లేదు. అదేవిధంగా ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 2 పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదట. దేశంలో జరుగుతున్న సర్వేలన్నీ ఈసారి టీఆర్‌ఎస్‌కి రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చేది కూడా డౌటేనని కోడై కూస్తుంటే, ఈ సిద్ధాంతి మాత్రం కాంగ్రెస్‌కి రెండు స్థానాలకు మించి రావని భవిష్యత్తు వాణి వినిపిస్తున్నారు.
మొన్నటి ఎన్నికలలో కేసీఆర్ని తిప్పతిప్పి కొట్టి అధికార పీఠం నుంచి కిందకి లాగిన రేవంత్ రెడ్డి ఒక లిల్లీపుట్ అంట. ఈయన మాత్రం పెద్ద ఆజానుబాహుడైనట్టు. ప్రజలు ప్రలోభాలకు లొంగిపోయి కాంగ్రెస్‌కి ఓటు వేసి గెలిపించారట. ఇప్పుడు తప్పు తెలుసుకుని బాధపడుతున్నారట. 
నిన్న హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత కనిపెట్టిన వాడికి పొర్లు దండాలు పెట్టాలన్నంత గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆ సామెతకి నిలువెత్తు నిదర్శనంగా ఆ సభలో కేసీఆర్ మరోసారి కనిపించారు. కేసీఆర్ మాటల్లో అదే అహంకారం, అవే అబద్ధాలు, అవే తిట్లు, శాపనార్థాలు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదట.. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలట. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. దుర్మార్గమైన పాలన చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు భావిస్తే ఎన్నికల సందర్భంలో ఎలాగూ బుద్ధి చెబుతారు. అప్పటిదాకా అన్నీ మూసుకుని రెస్టు తీసుకోకుండా కేసీఆర్‌కి ఈ జ్యోతిషాలు, తిట్టు, శాపనార్థాలు ఎందుకంట?
 

By
en-us Political News

  
టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘జనగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది.
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది.
గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు
అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు.
ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
మనసు ఒక చోట..మనువు ఒకచోట అన్నట్లుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వైఖరి ఉంది. గత ఐదేళ్లుగా వైసీపీ, బీజేపీల రహస్య మైత్రి ఎంత దృఢంగా కొనసాగిందో తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి దక్షిణాది నుంచి కూడా మద్దతు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పాతమిత్రులకు ఆహ్వానం పలికింది. ముఖ్యంగా ఏపీలో ప్రజాభిమానం మెండుగా ఉన్న తెలుగుదేశం అవసరం బీజేపీకి తప్పని సరి అయ్యింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.