ఏలూరులో దూసుకుపోతున్న కూటమి!

Publish Date:Apr 30, 2024

Advertisement

ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎదురౌతున్న సవాళ్లు, విమర్శల ప్రభావం ఇసుమంతైనా కూటమి అభ్యర్థులపై కనిపించడం లేదు. ఏలూరు లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పుట్టా మహేక్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూడా విస్తృతంగా పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. 

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఏలూరు లోక్ సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్దానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్ సభ స్థానంతో పాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలోనూ కూటమి అభ్యర్థులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమి శ్రేణుల్లో విశ్వాసం నింపడమే కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలలో అక్కడక్కడా తలెత్తిన అసమ్మతిని కూడా బుజ్జగించి కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా పని చేసేలా దిశానిర్దేశం చేశారు.  

ఏలూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నూజువీడు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం మాజీ కన్వీనర్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అసమ్మతి రాగం ఆలపించారు. అయితే వెంటనే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, తెలుగుదేశం ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వెంటనే రంగంలోకి దిగారు. ముద్రబోయనను సముదాయించి, కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించారు. అలాగే దెందులూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ను నిలబెట్టే విషయంలో తెలుగుదేశం అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఆ నియోజకవర్గంలో చింతమనేని విజయాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. అలాగే పొత్తులో భాగంగా ఏలూరు లోక్ సభ పరిధిలోని   పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాకే కైకలూరు నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు.

ఈ మూడు నియోజకవర్గాలలోనూ కూడా కూటమి శ్రేణులు ఐక్యంగా కదం తొక్కుతున్నారు. మొత్తం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం జోరు స్పష్టంగా కనిపిస్తుంటే. అధికార వైసీపీలో మాత్రం జోష్ కానరావడం లేదు.

By
en-us Political News

  
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు హైదరాబాద్ లో రెయిడ్స్ చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే ఆశోక్ నగర్ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న అధికారులు.. ఏసీపీ నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేస్తున్నారు.
చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు.. వైసీపీ దండుపాళెం బ్యాచ్ తమ కర్మఫలాన్ని అనుభవించడం కోసం రోజులు లెక్కపెట్టుకుంటోంది.
ఉగ్రవాదం అంటే మనం సాధారణం గా తాలిబన్ ఉగ్రవాదులు ని అనుకుంటూ ఉంటాము,కానీ ప్రపంచం లో అంతకంటే భయంకరమైన ఉగ్రవాదం ఇంకొకటి వుంది , అది ఆర్ధిక ఉగ్రవాదం - ప్రపంచం అంత తాను నమ్మిన సిధ్ధాంతాన్ని మాత్రమే నమ్మాలి , అలా నమ్మకపోతే అందరినీ చంపేయాలి అంటే చంపేసి అయినా సరే తన వాదనే నెగ్గాలి అని భావించి దాన్ని కార్యాచరణ లో పెట్టడం ఉగ్రవాదం ప్రధాన ఎజెండా.  అందులో లాజిక్ ఏమీ ఉండదు ,  ఈ నేపథ్యంలో  పిల్లి మెడలో గంట కట్టేవారు ఎవరు అనే ప్రశ్నకు భారత పోలీసులు సమాధానం వెతికారు. 
జగన్, ఐప్యాక్ ఇద్దరూ కలసి ఉద్యోగులను కరేపాకులా వాడుకుని విసిరేశారు.
ఏపీ రాజ‌కీయాల్లో పోలింగ్ త‌రువాత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ‌లితాలు రాక‌ముందే వైసీపీ నేత‌లు ప‌క్క‌ చూపులు చూస్తున్నారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, కూట‌మి 140 నుంచి 150 సీట్ల‌తో తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం(మే21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్ 15
ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా 570 రాళ్ళున్నాయి.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.