అవినీతి బురద కొద్దిగా వున్నప్పుడే… కడుక్కోవటం మంచిది!

Publish Date:Jun 1, 2017

Advertisement

కేంద్రంలో యూపీఏ పాలన పదేళ్లు, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పదేళ్లు కొనసాగాయి. తరువాత 2014లో ఏపీ, తెలంగాణ,  దిల్లీల్లో ప్రభుత్వాలు మారాయి. అయితే, మోదీ, చంద్రబాబు, కేసీఆర్ ఇంత వరకూ గర్వంగా చెప్పుకోగలిగింది అవినీతి రహిత పాలనే! ఆంధ్రాలో వైసీపీ బాబుగారి అవినీతి అంటూ గోల చేసినా ఇప్పటి వరకూ బలమైన ఆధారాలతో ఏ కేసులోనూ కార్నర్ చేయలేకపోయింది. ఇక మోదీ, కేసీఆర్ అయితే ప్రతిపక్షాలకి అవినీతి విషయంలో కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. వేరే వివాదాలు ఎన్ని తలెత్తినా అవినీతి, కుంభకోణాలు మాత్రం అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు గులాబీ సర్కార్ ని ఇబ్బంది పెట్టలేదు. కాని, తాజాగా బయటపడ్డ మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా కనిపిస్తోంది…

 

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ఆసరా చేసుకుని సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు చేతి వాటం చూపిన సంగతి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. కోట్లు ఖరీదు చేసే నగరంలోని భూములు ఆక్రమార్కుల చేతికి చిక్కాయి. ఇప్పుడు కేసీఆర్ గట్టి చర్యలు తీసుకుని జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు ఆయన సర్కార్ ప్రతిష్ఠ దిగజార్చేలా వున్నాయి. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే తొలి తెలంగాణ ప్రభుత్వంపై వున్న పారదర్శకమైన అభిప్రాయం బలహీనపడే అవకాశం వుంది.

 

మియాపూర్ లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు గోల్ మాల్ చేశారు అధికారులు. అయితే, ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కేసీఆర్ క్యాబినేట్లోని ఒక సీనియర్ మంత్రి ఈ కుంభకోణానికి సహకరించారట! ఆయన పేరు, ఆయన శాఖ గురించి మీడియా చెప్పకున్నా…. చాలా బలమైన ఆధారాలే లభించాయట ఆయన ఇన్వాల్వ్ మెంట్ గురించి. అసలు మియాపూర్ భూముల గోల్ మాల్ లో తొలి లబ్ధిదారుడు ఆయనే అంటోంది మీడియా. 50కోట్లు విలువ చేసే భూమి మంత్రి ఫ్రీగా కాజేశారట.

 

కేసీఆర్ క్యాబినేట్లో ఒక సీనియర్ మంత్రి స్వయంగా ప్రొత్సహించి మియాపూర్ భూముల అక్రమాలు నడిపించారనేది మామూలు ఆరోపణ కాదు. అందులో నిజం వున్నా లేకున్నా సీఎం వెంటనే ఆ మంత్రి ఎవరో నిర్ధారించుకుని చర్యలు తీసుకుంటే బావుంటుంది. అసలు అవినీతి జరగకపోతే చాలా బావుండేది. కాని, తప్పు జరిగిందని ఆల్రెడీ అర్థమవుతోంది. ఇక అందులో మంత్రి హస్తం వుందని వార్తలు రావటం జనంలోకి తప్పుడు సంకేతాలు పంపుతాయి. అందుకే, కేసీఆర్ సదరు మంత్రి ఎవరో తెలుసుకుని వేటు వేస్తే నైతికంగా వుంటుంది. ఆయన తప్పేం లేదని భవిష్యత్ లో తేలితే తిరిగి పదవి ఇవ్వవచ్చు. గతంలో సీఎం మంత్రి రాజయ్యను కఠిన వైఖరి అవలంబి తొలగించారు. ఇప్పుడూ అలాగే చేస్తే ఆయనపై జనంలో నమ్మకం పెరుగుతుంది! లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారే అవకాశం లేకపోలేదు. ఈ మధ్యే జింకల వేట విషయంలో కూడా ఓ మంత్రి పేరు పదే పదే పరోక్షంగా వినిపిస్తూ వచ్చింది…

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.