కేసీఆర్ ప్రేలాపనల ఉద్దేశ్యం ఏమిటో?

Publish Date:Jan 30, 2013

Advertisement

 

ఇంతవరకు తెలంగాణా ఉద్యామానికి తానొక్కడే పూర్తీ హక్కులు కలిగి ఉన్నట్లు, తెలంగాణా కాంగ్రెస్, తెలంగాణా తెదేపా, బీజేపీ మొదలయినవన్నీ తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నపటికీ ఆ పార్టీ నేతలను ఏదో ఓసమయంలో కించపరుస్తూనే,వారందరూ తెలంగాణా విషయంలో తననుసరించవలసిందే తప్ప తనకన్నా ముందు నడువరాదన్నట్లు ప్రవర్తించడం అలవాటయిన కేసీఆర్, మొన్న సమరదీక్ష అనంతరం జాతీయ నాయకులూ సైతం తన ముందు బలాదూర్ అన్నట్లు మాట్లాడి ప్రజాగ్రహానికి గురయ్యాడు. అయితే, ఇటువంటి మాటలు అతనికి కొత్త కాకపోయినా, అవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తుండటం అతనికి అలవాటు. ఇప్పుడు అతను ఏఉద్దేశ్యంతో ఆవిధంగా మాట్లాడేడో చూస్తే, దానికి కొన్ని కారణాలు కనబడుతాయి.

 

కేసీఆర్ తన ప్రేలాపనలతో, అతను తెలంగాణా రావాలని కోరుకోవట్లేదనే వాదనకు బలం చేకూరింది. ఇప్పటికే అతను 2014 ఎన్నికల గురించి చాలాసార్లు మాట్లాడాడు గనుక, ఇప్పుడు ఈ విదంగా మాట్లాడి, కాంగ్రెస్ అధిష్టానాన్నికూడా గిచ్చితే, వారికి సహజంగానే కోపం కలిగి, రాష్ట్రంలో శాంతి భద్రతల కారణం చూపిస్తూ ఇంతవరకు తెలంగాణాపై వారు చేస్తున్న కసరత్తును పక్కన బెట్టేసే అవకాశం ఉంటుంది. తద్వారా కేసీఆర్ తెలంగాణాకి సైందవుడిలా అడ్డుపడ్డాడని చెప్పవచ్చును.

 

ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొంటే, వచ్చేఎన్నికల వరకూ తెలంగాణా అంశాన్ని అతను ఆపగలిగితేనే అతనిపార్టీకి అఖండ విజయం సిద్దిస్తుందని, అందువల్లనే కేసీఆర్ కోరుండే రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఈ విదంగా మాట్లాడి ఉండవచ్చునని భావించవచ్చును.

 

కేసీఆర్ తెలంగాణా ను అడ్డుకొనేందుకు చేసిన మరో ప్రయత్నం గురించి కూడా ఈ సందర్భంలో ప్రస్తావించక తప్పదు. అతను కొద్దిరోజుల క్రితం ఎవరూ అడుగకముందే, హైదరాబాదుపై ప్రజాభిప్రాయ సేకరణకు(రిఫరెండం) వెళ్దామని, స్వయంగా ప్రకటించడం కూడా తెలంగాణాను జాప్యం చేయడానికి చేసిన ప్రయత్నమేనని చెప్పవచ్చును. అయితే, ఆ ప్రతిపాదనను జేయేసీతో సహా అందరూ వ్యతిరేఖించడంతో ఆ విషయం అప్పుడు మరుగునపడిపోయింది. కానీ, అది అతని మనసులో ఆలోచనలను బయట పెట్టింది.

 

ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఈ విదంగా మాట్లాడటం ద్వారా తానూ కోరుకొన్నవిధంగానే స్పందనలు వచ్చాయి. తన మాటలతో విషం చిమ్మి రెండు ప్రాంతాల మద్య మరింత ద్వేషం పెంచగలిగాడు. తూరుపు జయప్రకాష్ రెడ్డి కేసీఆర్ ని , ప్రొఫెసర్ కోదండరాంలను ఓవైసీ సోదరులతో సరిపోలుస్తూ ఒవైసీలు ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చుపెడితే, కేసీర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మద్య చిచ్చుపెడుతున్నారని చెపుతూ, వారిరువురి మద్య తేడాలేదని అన్నారు. ఇంతవరకు అయన మాటలను ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా ఇప్పుడు కేసీఆర్ తన ప్రేలాపనలతో అయన మాటలను నిజం చేసినట్లయింది.

 

కేసీఆర్ కి వ్యతిరేఖంగా అనేక పోలీసు స్టేషన్లలో కేసులు వేయబడ్డాయి. అవి ముందుకు సాగుతాయ లేదా అనే విషయాన్నీ పక్కన బెడితే, అతను తన మాటలతో ఇరుప్రాంతాల ప్రజల మద్య ఇప్పటికే ఉన్న దూరాన్ని, విద్వేషాలను మరింత పెంచాడని అవి స్పష్టం చేస్తున్నాయి. ఒక ఉద్యమనేతగా, భాద్యతగల పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సరయిన మార్గ నిర్దేశం చేయవలసిన కేసీఆర్ తన మాటలతో ఉద్యమానికి కళంకం ఆపాదించాడు.

 

తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఈ విధంగా ప్రజలమద్య విద్వేషాలను రెచ్చగొట్టడం అతను మన ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాలు విసిరాడని చెప్పకతప్పదు. ఒకవేళ అతను, అతని పార్టీ ప్రస్తుతం తెలంగాణా వద్దని కోరుకొంటే, అదే విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా చెప్పి ఆపించుకోవచ్చును. తన పార్టీ రానున్న ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవాలని కోరుకొంటే అందుకు అతను ఇటువంటి ఆలోచనలకంటే ఇంతకంటే మేలయిన మరో ఆలోచన చేయడం మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.