కవిత కు సుఖేశ్ ఫోబియా.. చాటింగ్ పై మౌనం

Publish Date:Apr 14, 2023

Advertisement

మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో చాటింగ్ చేశానంటూ వెల్లడించిన వివరాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ తో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదంటూ ఆమె స్పందించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు.

సుఖేష్ చంద్రశేఖర్ న్యాయవాది అయితే కవిత స్పందన చిన్ని పిల్లల తీరులో ఉందని ఎద్దేవా చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొనడానికి కవిత భయపడుతున్నట్లుగా ఉందని అన్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆరోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమె ముందుకు రావాలని, అందుకు భిన్నంగా విచారణను ఎదుర్కొనేందుకు జంకుతున్నారంటే తన క్లయంట్ ఆరోపణలు వాస్తవం కావడమే కారణమని పేర్కొన్నారు.

 సుఖేశ్  ఆరోపణలు ఆధారరహితమైనవయితే ఆ విషయం దర్యాప్తులోనే వెల్లడవుతుంది కదా అని ప్రశ్నించారు.  సుఖేష్ ఆరోపనలకు కవిత స్పందించిన తీరు  మీడియా, రాజకీయ పార్టీల మీదకు తప్పు తోసేయాలన్న ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు.   సుఖేశ్   ఆరోపణలను  నిబంధనల ప్రకారమే వెల్లడించారని తెలిపారు. ఎవిడెన్సు యాక్టులోని సెక్షన్ 65(బీ) ప్రకారం సర్టిఫై చేశారని, ఆయన తన ఆరోపణలను  అఫిడవిట్ రూపంలోనే అందజేశారని, అందువల్లనే డిజిటల్ ఎవిడెన్సుగా పనికొచ్చే స్క్రీన్ షాట్‌లను విడుదల చేశారని సుఖేష్ న్యాయవాది వివరించారు.

 సుఖేశ్ చేసిన ఆరోపణలన్నింటినీ రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థల పెద్దలను అడ్రస్ చేస్తూ రాసిన లేఖలో కూడా సమగ్రమైన దర్యాప్తును కోరారని ఆయన చెప్పారు.  దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా సుఖేష్ ఆరోపణలను ఆమె ఖండించిన తీరు ఉందని పేర్కొన్నారు.   మొత్తం మీద సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణల తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉందన్న అనుమానాలు మరింత బలపడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.