జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నేత పాదయాత్ర!!

Publish Date:Jan 26, 2019

Advertisement

 

కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా నుంచి వైఎస్‌ జగన్‌ వెంట నడిచిన తొలి నాయకుడు. ఇది నాలుగేళ్ల క్రితం మాట. ఇప్పుడు అంతా మారిపోయింది. 2014 ఎన్నికల సమయంలో జగన్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విష్ణు జనం మధ్యకు వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో శుక్రవారం పాదయాత్ర ప్రారంభించి కావలి వైసీపీలో వణుకు పుట్టించారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిది కాంగ్రెస్‌ కుటుంబం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే వీరాభిమానం. కాంగ్రెస్ హయాంలో అక్రమాస్తుల కేసులో జగన్‌ తొలిసారి అరెస్ట్‌ అయిన సందర్భంలో వైఎస్‌ కొడుకును అరెస్ట్‌ చేయడం అన్యాయం అని మాట్లాడిన తొలి నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి. జగన్‌ సొంత పార్టీ జెండాతో బయటకు వచ్చినప్పుడు జిల్లా నుంచి వైసీపీలో చేరిన తొలి నాయకుడు కూడా ఆయనే. అయితే గత ఎన్నికల్లో కావలి టికెట్‌ ఆశించినా దక్కకపోవడంతో పార్టీ మీద అభిమానంతో వైసీపీ అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలని ఆనాడే ఈయన కోరినట్లు, తప్పకుండా ఇస్తానని జగన్‌ తనకు మాట ఇచ్చినట్లు విష్ణు చెబుతూ వచ్చారు. అదే ఆశతో సంక్రాంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి టికెట్‌ విషయం జగన్ తో మాట్లాడారు. టికెట్ ఇవ్వడం కుదరదని జగన్‌ తేల్చి చెప్పడంతో వెనుతిరిగారు.
 
తను ఏ కుటుంబానికైతే వీరాభిమానిగా ఉన్నారో ఆ కుటుంబం నుంచే తనకు నిరాదరణ ఎదురుకావడంతో జగన్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ జనం మధ్యకు బయలుదేరారు. జగన్‌ తీరు నచ్చక పలువురు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే పార్టీలోనే ఉంటూ, జగన్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తీర్పు కోసం జనం మధ్యకు వెళ్లిన తొలి నాయకుడు విష్ణు కావడం విశేషం. పాదయాత్ర ఆలోచనను విరమింపజేయాలని వైసీపీ అధిష్ఠానం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విష్ణు తన నిర్ణయం మార్చుకోలేదు. తన విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తేల్చుకోవడం కోసం జనం మధ్యకు బయలుదేరారు. శుక్రవారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
 
విష్ణువర్ధన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేమని జగన్‌ స్పష్టం చేసిన విషయం తెలుసు. రామిరెడ్డికే మళ్లీ టిక్కెట్టు ఇస్తారనీ తెలుసు. అధిష్ఠానం మాట కాదని ఆయన వెంట వెళ్లడం వల్ల సొంత పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుసు. వచ్చే ఎన్నికల్లో విష్ణు ఏ గుర్తుపై పోటీ చేస్తారో తెలియదు. అసలు పోటీ చేస్తారో లేదో గ్యారెంటీ లేదు. గెలుపు విషయంలో క్లారిటీ లేదు. అయినా.. విష్ణువర్ధన్‌రెడ్డి పాదయాత్రకు భారీ సంఖ్యలో జనం తరలిరావడం విశేషం. కావలితోపాటు ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కలిసిరావడంతో విష్ణు బలం మరింత పెరిగింది. వంటేరు వర్గం కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్రకు సంఘీభావం తెలుపడం విష్ణు డిమాండ్‌కు అదనపు బలం చేకూరింది.
 
విష్ణువర్ధన్‌రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో జనం రావడం, వారిలో అత్యధికులు వైసీపీ అభిమానులు కావడం ఆ పార్టీ అగ్రనేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజా మద్దతు కలిగిన నాయకుడు పార్టీకి దూరమైతే, లేక తిరుగుబాటు అభ్యర్థిగానో, మారో పార్టీ గుర్తుపైనో బరిలోకి దిగితే పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంపై పట్టున్న మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి కూడా విష్ణుతో జతకట్టడంతో వీరి కోరిక నెరవేరని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కావలితో పాటు పక్క నియోజకవర్గాల్లో సైతం వైసీపీకి నష్టం జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.