ఏమిటీ గో గోవిందం.. క‌రుణాక‌రా...

Publish Date:Apr 17, 2025

Advertisement

మీ హ‌యాంలో చేసిన పాత త‌ప్పులన్నీ
బ‌య‌ట ప‌డ‌తాయ‌నా?
భూమ‌న బాగోతాల వెన‌క దాగిన‌
అస‌లు ర‌హ‌స్యాలేంటి?
పాత త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకోడానికి
భూమ‌న చేస్తున్న కొత్త గో గాయాలేంటి?

మ‌డ‌క‌శిర  ఎమ్మెల్యే చెప్పిన‌ట్టు.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే ఎంత మాత్రం భ‌క్తిభావం లేని క‌రుణాక‌ర‌రెడ్డి ఏమిటి? ఇంత భారీ ఎత్తున గోనాట‌కం మొద‌లు పెట్ట‌డ‌మేంటి? నిజంగానే గోవుల‌పై ఆయ‌న‌కింత‌టి ప్రేముందా? ఇందులో దాగిన అస‌లు మ‌త‌ల‌బేంటి? అన్న‌దిప్పుడు ప్ర‌శ్నార్ధ‌కం అయి కూర్చుంది. ఇక్క‌డ క‌రుణాక‌ర‌రెడ్డి గోడ్రామా వెన‌క కొన్ని కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇది వ‌ర‌కు గోశాల డైరెక్ట‌ర్ గా ఉన్న వ్య‌క్తి ఉప్పందించ‌డం వ‌ల్లే.. ఈ మొత్తం తంతు భూమ‌న న‌డిపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆ మాజీ గోశాల డైరెక్ట‌ర్ పై  తొక్కిస‌లాట వ్య‌వ‌హారంలో టీటీడీ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో.. అత‌డు టీటీడీపై క‌క్ష క‌ట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు. దానికి తోడు ఇత‌డు భూమ‌నకు అత్యంత‌ ప్రియ శిష్యుడు కావ‌డంతో ఇదంతా వెన‌కుండి జరిపిస్తున్న‌ట్టు భోగ‌ట్టా.

ఆ మాజీ డైరెక్ట‌ర్ మాజీ టీటీడీ చైర్మ‌న్ మ‌ధ్య మ‌రో సీక్రెట్ కూడా దాగి ఉన్న‌ట్టు చెబుతున్నారు. గ‌తంలో వీరు విదేశీ గోవుల వ్య‌వ‌హారంలో స్కామ్ కి తెర‌లేపార‌నీ.. ఇది ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందో అన్న ఆందోళ‌న కొద్దీ ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ఈ గోమ‌ర‌ణాల‌ు అనే తేనెతుట్టె క‌దిపార‌నీ అంటున్నారు.

ఇదంతా ఒక నాట‌క‌మ‌ని తెలిసినా కానీ కూట‌మి ప్ర‌భుత్వం   పెద్దగా తిప్పి కొట్ట‌లేక పోతోంది. దానికి తోడు గోవుల‌కు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టులు, ఆపై త‌ర‌చూ చ‌నిపోయే గోవుల‌కు సంబంధించిన లెక్కల విష‌యంలో వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకోవ‌డం భూమ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చిన‌ట్ట‌య్యింది.

ఒక ప‌క్క చూస్తే భూమన త‌న రాజ‌కీయ వారసుడిగా రాణిస్తాడ‌నుకున్న కొడుకు కాస్తా ఆదిలోనే హంస‌పాదులా.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడ‌టం. ఆపై కార్పొరేష‌న్ వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్ అవ‌డం వంటి అంశాల‌తో అత‌డు ఎంత మాత్రం పెర్ఫామెన్స్ చూపించ‌లేక పోతున్నాడు. ఇది గ‌మ‌నించిన భూమ‌న తానే స్వ‌యంగా రంగంలోకి దిగి పార్టీని తిరిగి గాడిలో పెట్ట‌డం, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఈ గో డ్రామాకు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. 

ఇది రెండు విధాలుగా భూమ‌నకు అవ‌స‌రంగా క‌నిపిస్తోంది. గ‌తంలో తన పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాలంటే ముంద‌ర‌ కాళ్ల బంధం అత్య‌వ‌స‌రం. ఇటు చూస్తే క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంతో పాటు ఇంకా ఎన్నో విష‌యాల్లో భూమ‌న గ‌ట్టిగా ఇరుక్కునే విధంగా క‌నిపిస్తోంది. ఆ మాట‌కొస్తే గ‌త ఐదేళ్ల‌లో 2 వేల మంది భార‌త‌మ్మ సైన్యం అన్య‌మ‌త‌స్తుల రూపంలో తిరుమ‌ల‌లో పెద్ద ఎత్తున కీల‌క శాఖ‌ల‌లో కీల‌కంగా ప‌ని చేస్తున్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. వీరంద‌రి ద్వారా ఇన్నాళ్ల పాటు సాగిన విధ్వంసం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డే ప్ర‌మాద‌ముంది.

టీటీడీకే అత్యంత కీల‌క‌మైన ఆన్ లైన్ బుకింగుల్లో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ టికెట్ల‌తో పాటు పాసుల జారీ వ‌ర‌కూ భారీ ఎత్తున గోల్ మాల్ జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ఒక్క రోజానే వేల కొద్దీ పాసులు జారీ చేసి.. ల‌క్ష‌ల్లో వ‌సూలు చేశార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాలంటే ఇదే స‌రైన ప‌నిగా భూమ‌న ఈ గోనాట‌కాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.

ఒక ప‌క్క టీటీడీ చైర్మ‌న్ గా బీఆర్ నాయుడు బాద్య‌త‌లు చేప‌ట్టినప్ప‌టి నుంచి త‌ర‌చూ ఏవో  వివాదాలు. తొక్కిస‌లాట గొడ‌వ‌లు, ఏకంగా ఒక బోర్డు మెంబ‌రే బూతులు, ఇక మ‌హా ద్వారం ముందు వ‌ర‌కూ చెప్పులేసుకుని రావ‌డాలు, ఫోటో షూట్లు, డ్రోన్లు ఆనంద నిల‌యం మీద ఎగ‌ర‌డాలు.. వంటి వివాదాస్ప‌ద అంశాల‌తో వ‌రుసగా దెబ్బ‌లు తింటూ వ‌స్తున్న పాల‌క మండ‌లిని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేయ‌టానికి.. గో మ‌ర‌ణాల వ్య‌వ‌హారాన్ని ముందుకు తేవ‌డంతో ఇటు టీటీడీ పాల‌క మండ‌లి, అటు ఈవో సైతం ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది.

అయితే ఇదంతా ప్ర‌తిప‌క్ష పార్టీ పారిస్తోన్న‌ పాచిక‌గా.. కేబినెట్ భేటీల్లో గుర్తించిన మంత్రి మండ‌లి..  దీన్ని తిప్పి కొట్టే కార్యాచ‌ర‌ణ త‌యారు చేయాల‌నుకున్నా.. అదెలాగో వారికంటూ ఒక అంచ‌నా లేక పోవ‌డంతో భూమ‌న గోనాట‌కం  ర‌క్తి క‌డుతోందని అంటున్నారు.  దీంతో గోవుల సంఖ్య నుంచి స్వామి వారికి త‌ర‌చూ తీసుకెళ్లే పాల వ‌ర‌కూ ఆయ‌న లెక్క‌లు బ‌య‌ట‌కు తీస్తుంటే, ఇక్క‌డ పాల‌క‌మండ‌లి బుర్ర తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో భూమ‌న మ‌రో అడుగు ముందుకేస్తూ  ఏనుగుల‌కు, గుర్రాల‌కూ స‌రైన ఆహారం అందించ‌లేక పోతున్నార‌నే విష‌యాల వ‌ర‌కూ ఏక‌ర‌వు పెడుతున్నారు. అక్క‌డితో చాల‌క నిషేధ‌మున్న కొండ మీద మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారాల‌ను సైతం జ‌నం ముందుకు తెస్తూ.. గ‌తంలో త‌మ పాల‌న‌లో జ‌రిగిన లోటు పాట్లు బ‌య‌ట‌కు పొక్క‌కుండా గ‌ట్టి కోట‌గోడే క‌డుతోంది క‌రుణాక‌ర్ రెడ్డిలోని రాజ‌కీయ చ‌తుర‌త‌.

అందుకే ఆయ‌న ఫేక్ ఫోటోలు వీడియోల‌తో చేసే ప్ర‌చారం సైతం చెల్లుబాటు అవుతోంద‌ని అంటున్నారు. ఇదే తెలంగాణ‌లో కంచె గ‌చ్చిబౌలీ భూముల వ్య‌వ‌హారంలో ఫేక్ వీడియోలు, ఫోటోల‌ను షేర్ చేసిన స్మిత స‌బ‌ర్వాల్ వంటి వారిని కూడా వ‌దిలి పెట్టుకుండా కేసులు బుక్ చేస్తున్నారు. నోటీసులు పంపుతున్నారు. అలాంటిదిక్క‌డ క‌నుచూపు మేర కూడా క‌నిపించ‌డం లేదు. భ‌య‌పెట్ట‌డానికైనా కేసులు, నోటీసులు పంప‌లేక పోవ‌డంతో.. భూమ‌న రోడ్డు మీద‌ కొచ్చి మ‌రీ మ‌హాభార‌తంలో గోగ్ర‌హ‌ణం అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు.
 
గురువారం  శ్రీవారి నిజ‌నేత్ర ద‌ర్శ‌నం జ‌రుగుతుంద‌ని అంటారు. ఆ రోజు స్వామివారి ప‌ట్ల తప్పు ఎవ‌రు చేస్తున్నారో వారి బండార‌మంతా బ‌య‌ట ప‌డుతుంద‌ని చెబుతారు. అలాంటి గురువారం ఎప్పుడొస్తుంది? ఈ గోనాట‌కాల వెన‌క దాగిన ర‌హ‌స్యాలు ఎప్పుడు బ‌య‌ట ప‌డుతాయో ఎదురు చూస్తున్నారు స్వామివారి భ‌క్తులు.

By
en-us Political News

  
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.