రాయచోటి కాంగ్రెస్ టిక్కెట్ కై పోటాపోటీ
Publish Date:Mar 30, 2012
Advertisement
కడపజిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ కు పోటీ పెరిగింది. నిన్నటి వరకూ ఈ టిక్కెట్ కోసం పిసిసి సభ్యుడు రాం ప్రసాద్ రెడ్డి, రమేష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం కూడా వీరిద్దరిలో ఒకరి పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న ముస్లింలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల జయాపజయాలను నిర్ణయించే శక్తి ముస్లింలకే ఉంది. ఇది గమనించిన మైనారిటి నేతలు ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ తమ వర్గానికి ఇవ్వాలని ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ముస్లింల తరపున పోటీకి కాంగ్రెస్ నాయకులు కాసింఖాన్ సిద్ధపడుతున్నారు. గతంలో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయినా కాసింఖాన్ ఈసారి మాత్రం తనకు రాయచోటి టిక్కెట్ ఇస్తే తప్పక గెలుస్తానని అధిష్టానానికి భరోసా ఇస్తున్నారు. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా హాబీబుల్లా విజయం సాధించారు. ఆ తరువాత 1983లో కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీమతి హబీబుల్లా, 1985లో తెలుగుదేశంపార్టీ తరపున దాదేసాహెబ్ లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఏ పార్టీ కు ముస్లింలకు టిక్కెట్ ను కేటాయించలేదు. దీంతో ముస్లింలు అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
http://www.teluguone.com/news/content/kadapa-district-rayachoti-assembly-constituency-24-13031.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





