మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ఆ ఇద్దరి నేతల కన్ను : బండి సంజయ్
Publish Date:Nov 8, 2025
Advertisement
దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్పేట్ శివాజీ విగ్రహం వద్ద బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరని తెలిపారు. ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా ముఖ్యమంత్రి..నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని బండి సంజయ్ విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు.. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడని కేంద్ర మంత్రి అన్నారు. 80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు కమలం పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాని పోటీ ఉందని తెలిపారు. హిందువులు వర్సెస్ ముస్లింల మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయిని తెలిపారు. తురకోళ్ల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండని ఓటర్లకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనరని ఆరొపించారు. కాంగ్రెసోళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నరు. కేటీఆర్ నెంబర్ వన్ చోర్ అని ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎట్లా వచ్చాయిని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలీ పని చేసుకున్న విషయం మర్చిపోదామా అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామని స్ఫష్టం చేశారు. అక్కడ పేదలకు ఇండ్లు కట్టి ఇస్తామన్నారు. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే... కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే.. కనీసం ఫోటో కూడా పెట్టడం లేదని తెలిపారు. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారని కేంద్రమంత్రి అన్నారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు అని వాటిని చూపించారు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని బండి సంజయ్ తెలిపారు
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-39-209206.html





