నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
Publish Date:Jan 18, 2013
Advertisement
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి తెలుగు దేశం పార్టీకి ఒక శాపాన్ని, ఒక వరాన్నిఅందించింది. నందమూరి వారి అర్ధాంగి శ్రీమతి లక్ష్మీ పార్వతి తెలుగుదేశo పార్టీ వచ్చే ఎన్నికలలో ఉనికి కోల్పోతుందని శాపానార్ధాలు పెట్టగా, జు.యన్టీఆర్ స్వయంగా తనకు ఇప్పుడప్పుడే రాజకీయాలలో చేరాలని ఆసక్తి లేదని విస్పష్టంగా ప్రకటించి, తెలుగు దేశం పార్టీలో అతనికి అన్యాయం జరుగుతోందనే ప్రచారానికి అడ్డుకట్ట వేసాడు. బాబాయి బాలకృష్ణ తో కలిసి వచ్చి తాతగారికి యన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన తరువాత జు.యన్టీఆర్ మీడియా వారితో మాట్లాడుతూ, తన మొదటి ప్రాముఖ్యత సినిమా రంగానికేనని, రాజకీయాలలోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నందున, ప్రస్తుతం తన సినిమాలపైనే లగ్నం చేయలనుకొంటున్నట్లు చెప్పాడు. అయితే, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో పాల్గోనలేకపోయినప్పటికీ, ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని తెలిపాడు. తద్వారా, ఇంతవరకు అతనిని పార్టీలోకి రాకుండా చంద్రబాబు, లోకేష్ అడ్డుకొంటున్నారనే అపవాదును తనే స్వయంగా ఖండించి పార్టీలో తనకి ఎవరితో విభేదాలు లేవని స్పష్టం చేసాడు. ఈ విధంగా అతను ప్రకటించడంవల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవనే విషయాన్నీ తెలియజేయగలిగేడు. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న నారా లోకేష్ కు ఇది కలిసొచ్చే అంశం గా చెప్పవచ్చును. ప్రస్తుతం జు.యన్టీఆర్ అతనితో పోటీ పడబోవట్లేదు గనుక ఇక నారా లోకేష్ పార్టీ కార్యక్రామలపై పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేయవచ్చును.
http://www.teluguone.com/news/content/jrntr-24-20469.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





