జగన్ కుర్చీలో నల్లులు!

Publish Date:Jul 26, 2024

Advertisement

జగన్ పెట్టక పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌ పక్కనే వున్న పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే, జగనన్న ఏదేదో సొల్లు అంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్‌తో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవీ వద్దు. మీరు మాత్రం రండి.. జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్‌మీట్‌లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు రెండు గంటలపాటు చెప్పీ చెప్పీ బుర్ర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగనన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు,  అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్‌ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా, ఆ ఫుటేజ్‌లో జగనన్నయ్య లీలలు లేకుండా వుంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్‌లో కూడా ట్రోలర్స్.కి, మీమర్స్.కి కావలసినంత ఫుటేజ్ వుంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్తకొత్త తెలుగు పదాలు వున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు వున్నాయి.

వీడియో సంగతి అలా వుంచితే, జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. ఇద్దరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే, జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితిని జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్టు ‘‘రెండు ప్రశ్నలు సర్’’ అని అడగటం ప్రారంభించగానే, జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న  నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్.ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు.. ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చిట్టచివరికి, ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (అక్టోబర్18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావలసిందిగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసు మేరకు సజ్జల మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు 20 భాగస్వామ్యపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. హర్యానా ఎన్నికలో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేసీఆర్ విషయంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై కేసీఆర్ చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఇప్పుడు అదే రీతిలో బదులు చెప్పడానికి రెడీ అయిపోయారా? ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో చెలరేగిపోతారన్న పేరున్న కేసీఆర్ చంద్రబాబు ఎత్తులతో చతికిలపడిపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్నారు.
వైసీపీ పాలనలో విధ్వసానికి గురైన రాజధాని నగరం అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
మావోయిస్ట్ అగ్రనేత సుజాతను అత్యంత చాకచక్య్ంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసిన విషయాన్ని ధృవీకరించారు.
సైబరాబాద్ మెక్క, మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోందా? అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడిన విడదల రజని ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పదా అంటే పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం ఔననే అంటున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
హైద్రాబాద్లో  40 చోట్ల ఏకకాలంలో   ఐటీ సోదాలు  జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ , అన్విత బిల్డర్స్, అధినేత అచ్చుత్ రావ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
బోరుగడ్డ అనిల్‌ని అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు చేసిన దారుణమైన పని.
రెక్కీ చేసెయ్... ప్రాణం తీసెయ్.. ఇదే, రెండుపదుల వయసులోనే ఫస్ట్ మర్డర్ చేసి.... హత్యల శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసిన లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌సభ్యులకు చెప్పే నేరకమంత్రం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తొలి నుంచీ కాంగ్రెస్ లో ఉండి, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తల పట్ల రేవంత్ చిన్న చూపు చూస్తున్నారన్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.