కేసీఆర్ కు చంద్రబాబు మరో రిటర్న్ గిఫ్ట్.. బీఆర్ఎస్ పనైపోయినట్లేనా?

Publish Date:Oct 17, 2024

Advertisement

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేసీఆర్ విషయంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? 2019లో  తెలుగుదేశం పార్టీ ఓటమిపై కేసీఆర్ చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఇప్పుడు అదే రీతిలో బదులు చెప్పడానికి రెడీ అయిపోయారా? ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో చెలరేగిపోతారన్న పేరున్న కేసీఆర్ చంద్రబాబు ఎత్తులతో చతికిలపడిపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా ఉంచడమే ప్రధాన కారణమని అంటున్నారు. సరే అది పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో బలోపేతంపై దృష్టి సారించింది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంపై నజర్ పెట్టారు.  

కారణాలేమైతేనేం.. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం నేతలు చాలా వరకూ తమ దారి తాము చూసుకున్నారు. పార్టీని వీడారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదు. ఆ విషయం విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రస్ఫుటంగా అవగతమైంది.  తెలంగాణలో  ఏ ఎన్నిక జరిగినా...  పార్టీలన్నీ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ప్రాకులాడాయి, ప్రయత్నించాయి.  ఆ పార్టీ క్యాడర్  మద్దతు పొందిన పార్టీనే విజయం వరిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం.   అది కేవలం నమ్మకం కాదు.. నూటిని నూరుపాళ్లూ వాస్తవం అన్న సంగతి  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సందేహాలకు అతీతంగా రుజువైంది. 

ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు.. ఉంటారు. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ  ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో  ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ  జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  ఈ విషయం గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడంతో మరోసారి రుజువైంది. 

ఇక ఇప్పుడు రాష్ట్రంలో పార్టీపై చంద్రబాబు దృష్టి పెట్టడం అంటే బీఆర్ఎస్ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయిస్తానని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు. తెలంగాణలో స్థానిక ఎన్నికలలో  తెలుగుదేశం పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న బీఆర్ఎస్ బేజారైపోయింది. హైడ్రా, రుణమాఫీ, రైతు బంధు వంటి విషయాల్లో రేవంత్ సర్కార్ తీరును ప్రశ్నిస్తూ ఇప్పుడిప్పుడే ప్రజలలోకి వస్తున్న బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం ఎంట్రీతో జావగారిపోతున్నారు.  ఎందుకంటే తెలంగాణలో  తెలుగుదేశం కోసం అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు.  ఈ పదేళ్ల కాలంలో వారంతా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ మద్దతు 2023 ఎన్నికలలో  లభించకపోవడంతోనే బీఆర్ఎస్ పరాజయం పాలయ్యింది. 

ఇప్పుడు మళ్లీ తెలంగాణ తెలుగుదేశం దగ్గరకు వస్తే.. పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. వాటిని చెక్కు చెదరకుండా కాపాడుతున్న క్యాడర్ ఉంది. మరి రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అంటే మాత్రం సమాధానం దొరకదు.  అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. తరచుగా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ భవన్ లో క్యాడర్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా  రాష్ట్రంలో పార్టీకి సమర్ధుడైన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఒక సారి చంద్రబాబు తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టాననీ, పూర్వ వైభవం దిశగా పార్టీని నడిపిస్తాననీ ప్రకటించగానే.. ఇంత కాలం అక్కడా ఇక్కడా సర్దుకుని పబ్బం గడిపేస్తున్న మాజీలంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇంత కాలం పార్టీలో ఉంటూ కూడా ఏ మాత్రం క్రియాశీలంగా లేని నేతలు అలర్ట్ అయిపోయారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని చెప్పుకుంటూ పార్టీ పదవుల కోసం రేసులోకి వచ్చేస్తున్నారు.  ఈ పదేళ్లలో పట్టుమని పది సార్లు కూడా ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టని నేతలు సైతం తామే పార్టీకి ఇంత కాలం పెద్దదిక్కుగా ఉన్నామని చెప్పుకోవడానికి పోటీలు పడుతున్నారు.  ఇలా పార్టీ పదవి కోసం అర్రులు చాస్తున్న వారిలో కార్యకర్తలలో పలుకుబడి ఉన్నవారెవరు అంటే  ఎవరూ కనిపించని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పదేళ్లుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నామంటూ చెప్పుకుంటూ చొక్కాలు చించేసుకుంటున్న వారెవరికీ పార్టీ క్యాడర్ లో ఇసుమంతైనా పలుకుబడి లేదు.   తెలంగాణలో తెలుగుదేశం ఉంది. చాలా  బలంగా ఉంది. అయితే ఆ పార్టీకి రాష్ట్రఅధ్యక్ష పదవి మాత్రం ఖాళీగా ఉంది.  గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పదవి ఖాళీ అయ్యింది. అప్పట్లో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న  కాసాని జ్ణానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడన్న వాడే లేకుండా పోయారు.  తెలంగాణలో ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం తప్పుకోవడంతో అప్పట్లో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి చంద్రబాబు ఏం తొందరపడలేదు.

అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. దీంతో ఇక పార్టీ అధ్యక్షుడి ఎన్నిక లేదా ఎంపిక సత్వరమే జరగడం ఖాయం.   ఇప్పుడిక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారన్నది స్పష్టం కావడంతో రాష్ట్ర విభజన తరువాత   పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరి అక్కడ ఇమడలేక ఉక్కపోతకు గురి అవుతున్న పలువురు తెలుగుదేశం మాజీ నాయకులు హోం కమింగ్ అంటూ తెలుగుదేశం గూటికి చేరడానికి క్యూకడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కంగారు పడుతోంది. కంగాళీ అవుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం బలపడితే.. తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరమేనని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురౌతున్నారు. సరిగ్గా స్థానిక ఎన్నికల ముందు రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతమై చంద్రబాబు దృష్టి సారించడం అంటే కేసీఆర్ కు రెండో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై ఆయన పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన అంతం కావడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక ఏ అవరోధాలూ లేకుండా సజావుగా సాగి నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతుందన్న విశ్వాసం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
కేంద్రంలో కొలువుదీరి ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్ జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మోడీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ జమిలి ఎన్నికల జపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత జమిలి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణకు వేగవంతం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (అక్టోబర్18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావలసిందిగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసు మేరకు సజ్జల మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు 20 భాగస్వామ్యపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. హర్యానా ఎన్నికలో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్నారు.
వైసీపీ పాలనలో విధ్వసానికి గురైన రాజధాని నగరం అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
మావోయిస్ట్ అగ్రనేత సుజాతను అత్యంత చాకచక్య్ంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసిన విషయాన్ని ధృవీకరించారు.
సైబరాబాద్ మెక్క, మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోందా? అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడిన విడదల రజని ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పదా అంటే పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం ఔననే అంటున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
హైద్రాబాద్లో  40 చోట్ల ఏకకాలంలో   ఐటీ సోదాలు  జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ , అన్విత బిల్డర్స్, అధినేత అచ్చుత్ రావ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
బోరుగడ్డ అనిల్‌ని అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు చేసిన దారుణమైన పని.
రెక్కీ చేసెయ్... ప్రాణం తీసెయ్.. ఇదే, రెండుపదుల వయసులోనే ఫస్ట్ మర్డర్ చేసి.... హత్యల శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసిన లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్‌సభ్యులకు చెప్పే నేరకమంత్రం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.