ఇవేం సమీకరణాలు.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై పరిశీలకుల విస్మయం

Publish Date:May 18, 2022

Advertisement

ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పట్ల రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తమౌతున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక సమీకరణాలతో సంబంధం లేకుండా కేవలం అధినేత ఇష్టాయిష్టాలు, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అనిపిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉన్న నాలుగు స్థానాలలో ఇద్దరు వేరే పార్టీ నుంచి జంప్ జిలానీ పద్ధతిలో వచ్చిన వారైతే మిగిలిన ఇద్దరూ తనతో పాటు ఆర్థిక నేరాలలో సహ నిందితులు కావడాన్ని ఎత్తి చూపుతున్నారు.

అలాగే వైసీపీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరు బీసీలు కాగా మిగిలిన ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే ప్రకటించిన ఇద్దరు బీసీ అభ్యర్థులూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే. వారిద్దరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక కూడా క్విడ్ ప్రోకో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ నుంచి  రాజ్యసభకు కేసీఆర్ ఒక ఫార్మా కంపెనీ అధినేతను రాజ్యసభకు పంపనున్నారనీ, ఆ ఫార్మా కంపెనీ అధినేత వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కావడంతో అందుకు ప్రతిగా తెలంగాణ సీఎం సిఫారసు చేసిన ఆర్. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ నిర్ణయించారని చెబుతున్నారు.

ఇక బీసీ కోటాలో రాజ్యసభకు జగన్ ఎంపిక చేసిన మరో వ్యక్తి బీద మస్తాన్ రావు. ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వలస పక్షి. బీద మస్తాన్ రావుది నెల్లూరు జిల్లా కావ‌లి. ఈయ‌న కావ‌లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున నెల్లూరు లోక్ సభ స్థానానికి  పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే అసంతృప్తితో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇక మిగిలిన రెండు స్థానాలలో ఒకటి సిట్టింగ్ ఎంపీ విజయసాయిరెడ్డికే ఇచ్చారు.

ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 అన్న సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానం జగన్ అక్రమాస్తుల కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇచ్చారు. ఇలా వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలూ కూడా జగన్ వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఎంపికేనని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. క్విడ్ ప్రోకొ కింద తెలంగాణకు చెందిన ఆర్.లక్ష్మయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కూడా బీసీ ఉద్ధరణ కోసమే అని చెప్పుకోవడం జగన్ కే చెల్లిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. 
 

By
en-us Political News

  
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.