జ‌గ‌న్ సర్కార్ నిర్ల‌క్ష్య‌మే పోల‌వ‌రానికి శాపం

Publish Date:Jul 19, 2022

Advertisement

ఏపీలోని జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళికా లోపం, తగిన రీతిలో నిధులను విడుదల చేసే సామర్థ్యం లేకపోవడమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమని  కేంద్రం స్పష్టం చేసింది. సభలో తెలుగుదేశం రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బదులిచ్చారు. పోలవరం పూర్తికి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. 
ఎవ‌రన్నా ఇబ్బందిలో ఉంటే స‌హాయం కావాలంటే చేస్తాన‌నేవారు చాలా అరుదుగా దొరుకుతారు. కానీ త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తామ‌న్న‌వారికి కావ‌ల‌సిన స‌మాచారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం క్షంత‌వ్యం కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అస్స‌లు క్షంత‌వ్యుడు కారు.  

పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో   అడిగిన స‌మాచారం స‌మ‌యానికి అందించ‌డంలో  జగన్ సర్కార్ నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కానీ ముఖ్య‌మంత్రి నిర్ల‌క్ష్య ధోర‌ణితో రాష్ట్రం కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకుంటూ అప్ర‌తిష్ట‌పాల‌వ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ దీన్ని గురించి ఎప్పుడు చ‌ర్చ త‌లెత్తినా ఎంపీల‌కు అక్షంత‌లు త‌ప్ప‌డం లేదు. ఇపుడు తాజాగా క‌న‌క‌మేడ‌ల పోలవరంపై వేసిన ప్రశ్రకి సమాధానమిస్తూ కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ మంత్రి  జగన్ సర్కార్ వైఫల్యమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం  నిర్వాకంతోనే అన్నీ వెన‌క్కి పోతున్నాయ‌న్న‌ది కేంద్ర మంత్రిగారి స‌మాధాన సారాంశం. 

పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మంగళవారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీ క‌న‌క‌మేడ‌ల కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి బిశ్వేశ్వ‌ర తుడూను   పోల‌వ‌రం ప్రాజ‌క్టు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను నిర్ధారించ‌డానికి ప్ర‌భుత్వం ఏద‌యినా అంచ‌నా లేదా త‌నిఖీ చేసిందా అని ప్ర‌శ్నించారు. ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2014లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోల‌వ‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలో తీవ్ర జాప్యం జ‌రిగింది. అయితే ప్ర‌భుత్వ స‌లహా రూపంలో ఏద‌యినా స‌మాచారం ఇచ్చిందా, ఏపీ ప్ర‌భుత్వాన్ని మంద‌లించారా అని అడిగారు. అంతే కాకుండా పిఐపి(పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు) అమ‌లు చేసే ప్ర‌క్రియ‌లో దాని మిన‌హాయింపు లేదా క‌మిష‌న్ చేప‌ట్టిన చ‌ర్య‌లేమిట‌ని రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల ప్ర‌శ్నించారు. అందుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇస్తూ,ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టును ఏప్రిల్ 2022 నాటికి పూర్తి చేయాలనీ అయితే అయితే ప్ర‌స్తుతం హెడ్‌వ‌ర్క్స్, కుడి ప్ర‌ధాన కాలువ, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల పురోగ‌తి వ‌రుస‌గా 77 శాతం, 93 మరియు 72 శాతం  మాత్రమే పూర్తయ్యాయన్నారు. అందువలన ప్రాజెక్ట్  ఏప్రిల్, 2022 నాటికి పూర్తి చేయాలన్న గడువు దాటిపోయిందన్నారు. 

ఏప్రిల్ 2022 తర్వాత పైప్‌ల అమలుకు సంబంధించి ప్ర‌భుత్వ సమాచారం మేరకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ, ప్రస్తుత నిర్మాణ షెడ్యూల్‌ను సమగ్రంగా పరిశీలించడానికి , విశ్లేషించడానికి 2021 నవంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను ఏప్రిల్, 2022లో సమర్పించింది, జూన్, 2024 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సవరించిన లక్ష్యాన్ని సూచించిందని కేంద్రం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవసరమైన రీతిలో వ్యయసామర్ధ్యం లేకపోవడం, సరైన వ్యూహాత్మక ప్రణాళికా లోపం, ప్రణాళిక లేకపోవడమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సమన్వయ లోపం, కోవిడ్ సమస్యలు కూడా ప్రాజెక్టు జాప్యం అవడానికి కారణమని మంత్రి స్పష్టం చేశారు.

By
en-us Political News

  
బంగారం తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా? .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు.
పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు.
రాజ్ కసిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు.
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
  బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.