చంద్రబాబు ఫోన్ చూసి కేంద్ర మంత్రి ఫిదా
గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు ఫోన్ తీసుకుని.. బాగుంది ఏ మోడల్? అని ఆరా తీశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కొద్దిసేపు ఆ ఫోన్ ను తీక్షణంగా చూశారు కేంద్ర మంత్రి. కాగా అది ఫోల్డబుల్ ఫోన్. ఇప్పుడందరి చూపు ఈ ఫోన్ వైపు మళ్లింది. అసలు చంద్రబాబు వాడే మోడ్రన్ గాడ్జెట్స్ ఏవి? వాటి వివరాలు ఎంటి? తొలి నుంచీ చంద్రబాబుకున్న ఈ హైటెక్ హాబిటేషన్ ఏంటి? ఆ డీటైల్స్ ఏంటి? అన్న డిబేట్ మొదలైంది. చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్డేటెడ్ లైఫ్స్టైల్కు మరో నిదర్శనంగా చెబుతారు. చంద్రబాబు వాడే ఆధునిక గాడ్జెట్లు.. వాటి వివరాలు.. చంద్రబాబు ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ ఫోన్ను వాడుతున్నారు. అందులోనూ.. లేటెస్ట్ మోడల్. ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి, విప్పినప్పుడు ఒక చిన్న టాబ్లెట్లా మారుతుంది. దీని ఉపయోగం ఏంటో చూస్తే.. ఆయన నిరంతరం ఫైల్స్ చదవడం, డాష్ బోర్డులు పరిశీలించడం, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వంటివి చేస్తుంటారు. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల.. డేటా విశ్లేషణకు ఇది ఆయనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆ ఫోన్ చూసి ఆరా తీయడానికి కారణం దాని డిజైన్, బాబు గారు ఈ వయసులో కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుండటమే. చంద్రబాబు వద్ద గల ఇతర మోడ్రన్ గాడ్జెట్స్ ఏంటని పరిశీలిస్తే.. తన వెంట ఎప్పుడూ ఒక యాపిల్ ఐప్యాడ్ ఉంచుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి అంటే, హార్ట్ రేట్, స్టెప్ కౌంట్ వంటివి ఆయన టాప్ ఎండ్ స్మార్ట్ వాచ్లను ధరిస్తుంటారు. ఆయన వాడే డివైజ్లలో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు ఉంటాయి. దీని ద్వారా ఏ జిల్లాలో ఏ పథకం ఎలా అమలవుతుందో ఆయన వేలిముద్రతో తెలుసుకోగలరు. చంద్రబాబుకు టెక్నాలజీపై ఉన్న మక్కువ ఈనాటిది కాదు. తొలి నుంచీ ఆయన హైటెక్ హాబిటేషన్ కి చాలా పెద్ద హిస్టరీయే ఉంది. అదొక ప్రస్తానం. 1995-2004 మధ్య కాలంలోనే ఆయన క్యాసియో లేదా హెచ్ పీ పామ్ టాప్స్ వాడేవారు. అప్పట్లో కంప్యూటర్ల గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆయన డిజిటల్ డైరీలను మెయింటైన్ చేసేవారు. స్మార్ట్ ఫోన్ల విప్లవం రాకముందు ఆయన బ్లాక్ బెర్రీ ఫోన్లకు పెద్ద ఫ్యాన్. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అప్పట్లో అదే అత్యుత్తమ ఫోన్. దేశంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఘనత ఆయనదే. బాబు గారి టెక్నాలజీ వెనుక ఉద్దేశం ఏంటి? అని విశ్లేషిస్తే.. ఇది కేవలం స్టైల్ కోసం కాదు, ఒక ఎఫిషియన్సీ కోసం ఆయన ఎక్కువగా టెక్నాలజీని వాడుతారు. అంటే ప్రజలకు ఎప్పటికప్పుడు నిఖార్సయిన సమర్ధవంతమైన సేవలందించడానికే ఈ సాంకేతిక పరిజ్ఞానం తనకు అత్యవసరంగా భావిస్తారాయన. పేపర్ లెస్ గవర్నెన్స్ ఆయన అడ్మినిస్ట్రేటివ్ పాలసీ. వీలైనంత వరకు ఫైళ్లు డిజిటల్ రూపంలో ఉండాలని కోరుకుంటారు చంద్రబాబు. భావోద్వేగాల కంటే, గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన శైలి. కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఒక ఇంజనీర్, ఇక టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తినే చంద్రబాబు తన ఫోన్తో ఆకర్షించారంటే, 70 ఏళ్ల పైబడ్డ వయసులో కూడా ఆయన ఎంత యంగ్ అండ్ అప్డేటెడ్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారికి గాడ్జెట్స్ అంటే కేవలం వస్తువులు కావు, అవి ఆయన పనిని వేగవంతం చేసే ఆయుధాలు. కాబట్టి టెక్నాలజీ+ అడ్మినిస్ట్రేషన్ కి లేటెస్ట్ వర్షెన్ చంద్రబాబు అని చెప్పాల్సి ఉంటుందని అంటారు సాంకేతిక నిపుణులు.
Publish Date: Apr 29, 2026 12:01PM