political-news-img

చంద్ర‌బాబు ఫోన్ చూసి కేంద్ర మంత్రి ఫిదా

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఓ ఆసక్తికరమైన‌ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు ఫోన్ తీసుకుని.. బాగుంది ఏ మోడల్? అని ఆరా తీశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కొద్దిసేపు ఆ ఫోన్ ను తీక్షణంగా చూశారు కేంద్ర మంత్రి. కాగా అది ఫోల్డబుల్ ఫోన్. ఇప్పుడంద‌రి చూపు ఈ ఫోన్ వైపు మ‌ళ్ల‌ింది. అస‌లు చంద్ర‌బాబు వాడే మోడ్ర‌న్ గాడ్జెట్స్ ఏవి? వాటి వివ‌రాలు ఎంటి? తొలి నుంచీ చంద్ర‌బాబుకున్న ఈ హైటెక్ హాబిటేష‌న్ ఏంటి? ఆ డీటైల్స్ ఏంటి? అన్న డిబేట్ మొద‌లైంది. చంద్రబాబు నాయుడుకు హైటెక్ అనే పేరు ఊరికే రాలేదు. 90వ దశకంలోనే ఐటి ప్రాధాన్యతను గుర్తించి, చేతిలో ఒక పామ్ టాప్ పట్టుకుని తిరుగుతూ అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్ర‌బాబు. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన ఫోన్ చూసి ఆశ్చర్యపోవడం, బాబు గారి అప్‌డేటెడ్ లైఫ్‌స్టైల్‌కు మరో నిదర్శనంగా చెబుతారు. చంద్రబాబు వాడే ఆధునిక గాడ్జెట్లు.. వాటి వివరాలు.. చంద్రబాబు ప్ర‌స్తుతం శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ ఫోన్‌ను వాడుతున్నారు. అందులోనూ.. లేటెస్ట్ మోడ‌ల్. ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి, విప్పినప్పుడు ఒక చిన్న టాబ్లెట్‌లా మారుతుంది. దీని ఉపయోగం ఏంటో చూస్తే.. ఆయన నిరంతరం ఫైల్స్ చదవడం, డాష్ బోర్డులు పరిశీలించడం, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వంటివి చేస్తుంటారు. పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల.. డేటా విశ్లేషణకు ఇది ఆయనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. కేంద్ర‌మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ ఫోన్ చూసి ఆరా తీయడానికి కారణం దాని డిజైన్, బాబు గారు ఈ వయసులో కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతుండటమే. చంద్రబాబు వద్ద గ‌ల‌ ఇతర మోడ్రన్ గాడ్జెట్స్ ఏంట‌ని ప‌రిశీలిస్తే.. తన వెంట ఎప్పుడూ ఒక యాపిల్ ఐప్యాడ్ ఉంచుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడానికి అంటే, హార్ట్ రేట్, స్టెప్ కౌంట్ వంటివి ఆయన టాప్ ఎండ్ స్మార్ట్ వాచ్‌లను ధరిస్తుంటారు. ఆయన వాడే డివైజ్‌లలో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు ఉంటాయి. దీని ద్వారా ఏ జిల్లాలో ఏ పథకం ఎలా అమలవుతుందో ఆయన వేలిముద్రతో తెలుసుకోగలరు. చంద్రబాబుకు టెక్నాలజీపై ఉన్న మక్కువ ఈనాటిది కాదు. తొలి నుంచీ ఆయ‌న‌ హైటెక్ హాబిటేషన్ కి చాలా పెద్ద హిస్ట‌రీయే ఉంది. అదొక ప్ర‌స్తానం. 1995-2004 మధ్య కాలంలోనే ఆయన క్యాసియో లేదా హెచ్ పీ పామ్ టాప్స్ వాడేవారు. అప్పట్లో కంప్యూటర్ల గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆయన డిజిటల్ డైరీలను మెయింటైన్ చేసేవారు. స్మార్ట్ ఫోన్ల విప్లవం రాకముందు ఆయన బ్లాక్ బెర్రీ ఫోన్లకు పెద్ద ఫ్యాన్. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అప్పట్లో అదే అత్యుత్తమ ఫోన్. దేశంలోనే మొట్టమొదటిసారిగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఘనత ఆయనదే. బాబు గారి టెక్నాలజీ వెనుక ఉద్దేశం ఏంటి? అని విశ్లేషిస్తే.. ఇది కేవలం స్టైల్ కోసం కాదు, ఒక ఎఫిషియ‌న్సీ కోసం ఆయ‌న ఎక్కువ‌గా టెక్నాలజీని వాడుతారు. అంటే ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు నిఖార్స‌యిన స‌మ‌ర్ధ‌వంత‌మైన సేవ‌లందించ‌డానికే ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం త‌న‌కు అత్య‌వ‌స‌రంగా భావిస్తారాయ‌న‌. పేపర్ లెస్ గవర్నెన్స్ ఆయ‌న అడ్మినిస్ట్రేటివ్ పాల‌సీ. వీలైనంత వరకు ఫైళ్లు డిజిటల్ రూపంలో ఉండాలని కోరుకుంటారు చంద్ర‌బాబు. భావోద్వేగాల కంటే, గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన శైలి. కేంద్ర ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఒక ఇంజనీర్, ఇక‌ టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తినే చంద్రబాబు తన ఫోన్‌తో ఆకర్షించారంటే, 70 ఏళ్ల పైబ‌డ్డ‌ వయసులో కూడా ఆయన ఎంత యంగ్ అండ్ అప్‌డేటెడ్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారికి గాడ్జెట్స్ అంటే కేవలం వస్తువులు కావు, అవి ఆయన పనిని వేగవంతం చేసే ఆయుధాలు. కాబ‌ట్టి టెక్నాల‌జీ+ అడ్మినిస్ట్రేష‌న్ కి లేటెస్ట్ వ‌ర్షెన్ చంద్ర‌బాబు అని చెప్పాల్సి ఉంటుంద‌ని అంటారు సాంకేతిక నిపుణులు.

Publish Date: Apr 29, 2026 12:01PM

political-news-img

బంగ్లాదేశ్ లో మశూచి మరణమృదంగం.. భారత్ కూ వ్యాపించే ప్రమాదం!

బంగ్లాదేశ్‌ను మీజిల్స్ (మశూచి) మహమ్మారి వణికిస్తోంది. గడిచిన కొన్ని వారాల్లోనే ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి దాదాపు 300మందికి పైగా మరణించారు. మృతులలో అత్యధికులు చిన్నారులే. గత రెండు దశాబ్దాలలో ఇంతటి తీవ్రమైన స్థాయిలో మీజిల్స్ వ్యాపించడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాలకు గానూ 58 జిల్లాల్లో మీజిల్స్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 90 శాతం దేశం మీజిల్స్ ప్రభావానికి గురైంది. మార్చి మధ్య కాలం నుండి ప్రారంభమైన ఈ వ్యాప్తి ఉధృతి ఏప్రిల్ ఆఖరు నాటికి పతాక స్థాయికి చేరింది. సుమారు 30 వేల మందికి పైగా చిన్నారులు.. మీజిల్స్ లక్షణాలతో బాధపడుతుండగా, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోషకాహారలోపం ఉన్న పిల్లలు మీజిల్స్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థాయిలో మీజిల్స్ ప్రబలడానికి గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కుంటుపడటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024లో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత, నిరసనల కారణంగా అప్పట్లో జరగాల్సిన సామూహిక టీకా కార్యక్రమాలు జరగలేదు. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత కూడా తోడవడంతో చిన్నారులలో రోగనిరోధక శక్తి తగ్గిపోయిందంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తోంది. తగిన సమయంలో బూస్టర్ డోసులు అందించకపోవడం వల్ల మీజిల్స్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉందని చెబుతున్నారు. కాగా మీజిల్స్ వ్యాధి తీవ్రత, వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మీజిల్స్ బంగ్లాదేశ్ పొరుగున ఉన్న మయన్మార్, భారత్ వంటి దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగ్లాదేశ్ నుండి ఇండియా, మయన్మార్ వంటి దేశాలకు జనాభా రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ సరిహద్దులు దాటే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ముఖ్యంగా కోల్‌కతా వంటి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించింది. మీజిల్స్ అనేది గాలి ద్వారా సోకే, అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి కావడంతో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సుమారు 1.8 కోట్ల మంది చిన్నారులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి అత్యవసర వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు జ్వరం లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Publish Date: Apr 29, 2026 11:46AM

political-news-img

తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణ స్వీకారం

తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం (ఏప్రిల్ 29)న ఘనంగా జరిగింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతనంగా ఎంపికైన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు. నూతన కార్యవర్గంలో మొత్తం 29 మందికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో, కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Publish Date: Apr 29, 2026 10:55AM

political-news-img

సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్.. ఇహనో, ఇప్పుడో అధికారిక ప్రకటన

భాగ్యనగర వాసుల ప్రధాన రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇక ప్రభుత్వం చేతికి వెళ్లనుంది. ఇప్పటి వరకు పీపీపీ అంటే.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా తన అధీనంలోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడే అవకాశాలున్నాయి. మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం (ఏప్రిల్ 30) నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం (మే 1) నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది. ఈ కీలక మార్పుతో మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ బదలాయింపు జరుగుతుందని చెబుతున్నారు. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడంతో పాటు.. ఆ సంస్థ పేరు మీద ఉన్న రుణాలను కూడా ప్రభుత్వం భరించనుంది. ఇందు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి భారీ రుణాన్ని సమీకరించి, సుమారు 20 ఏళ్ల పాటు చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిర్వహణలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ప్రస్తుత ఉద్యోగులలో మెజారిటీ సభ్యులు మరో ఏడాది పాటు తమ విధుల్లో కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు సలహాదారులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తారు. మెట్రోను ప్రభుత్వం స్వీకరించడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరల నియంత్రణతో పాటు, రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా రాయల్టీలు, ఇతర ఆర్థిక అంశాలపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైనట్లేనంటున్నారు.

Publish Date: Apr 29, 2026 10:26AM

political-news-img

మమత వర్సెస్ సువేందు.. భవానిపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, బుధవారం (ఏప్రిల్ 29) రెండో, చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి ఎలాగైనా బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అదలా ఉంచితే బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతం మమతా బెనర్జీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే, ఈసారి ఈ కోటను బద్దలు కొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక పోతే.. భవానీపూర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించిన సువేందు, మరోసారి ఆమెను సొంత గడ్డపై సవాల్ చేస్తున్నారు. దీంతో ఈ పోరు కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, ఇద్దరు నేతల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాలను ఈ సారి ఎన్నికలలో బీజేపీ ప్రచారాస్త్రాలుగా సంధిస్తే.. సంక్షేమ పథకాలు, బెంగాలీ సెంటిమెంట్‌తో మమతాబెనర్జీ ప్రచారాన్ని హోరెత్తించారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 4న విడుదల అవుతాయి.

Publish Date: Apr 29, 2026 10:04AM

political-news-img

బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు

భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఓ పదిహేనేళ్ల బాలుడి పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్ లో అతడు సృష్టిస్తున్న పరుగుల విధ్వంసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తోంది. కమిన్స్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లను సైతం అతడి అభిమానులుగా మార్చేస్తోంది. అతడే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ కుర్రాడు, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ చేసిన మెరుపు సెంచరీ అతడిని రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌ను చేసింది. కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసిన వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 12 సిక్సర్లు బాదడం విశేషం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అతను ఆడుతున్న తీరు క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు తన ప్రదర్శనతో ఆ రికార్డుల స్థాయిని మరింత పెంచుతున్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌లోని ప్రతిభను గుర్తించి 2025 వేలంలో 1.1 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా అతని బ్యాట్ స్పీడ్, స్ట్రోక్ ప్లే లో చూపిస్తున్న టైమింగ్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌లను గుర్తుచేస్తోందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే.. వైభవ్ సూర్యవంశీ అతి త్వరలోనే టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించిన ఈ యువ సంచలనం.. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్ ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా మంగళవారం (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్ లో ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడీ ఘనతను కేవలం ఈ ఘనతను కేవలం 167 బంతుల్లోనే అందుకున్నాడు. ఈ క్రమంలో ఆండ్రీ రసెల్ 188 బంతుల్లో నాలుగువందల పరుగుల రికార్డు చెరిగిపోయింది.

Publish Date: Apr 29, 2026 9:46AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img