జగన్ రిమోట్ సతీమణి చేతిలోనే..తాడేపల్లి ప్యాలస్ లో పవర్ సెంటర్ వైఎస్ భారతి!

Publish Date:May 20, 2022

Advertisement

వైసీపీలో కర్త, కర్మ, క్రియా అన్నీ జగనేనని ఇంత కాలం అంతా భావించారు. కానీ జగన్  రిమోట్ వైఎస్ భారతి అని తేలిపోయిందని వైసీపీ వర్గాలే ఇప్పుడు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం రెండో సారి దక్కడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. తనకు రెండో సారి అవకాశం ఇచ్చినందుకు విజయసాయి రెడ్డి జగన్ తో పాటు భారతికి కూడా కృతజ్ణతలు చెప్పడమే జగన్ రిమోట్ భారతి చేతిలో ఉందని చెప్పడానికి నిదర్శనమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

 వైఎస్ భారతి తాడేపల్లి ప్యాలస్ నుంచి చక్రం తిప్పుతున్నారనీ, ఆమె ఆమోద ముద్ర లేకుండా పార్టీలో ఏ నిర్ణయమూ జరగదనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయి విషయమే తీసుకుంటే.. తనకు రెండో సారి రాజ్యసభకు అవకాశం ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ణతలు చెప్పడం వరకూ ఓకే.. ఇంకా ఎవరికైనా కృతజ్ణతలు చెప్పాలంటే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు చెప్పాలి. అలాగే తనకు అడ్డు రానందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి చెప్పాలి. కానీ విజయసాయి మాత్రం వైఎస్ భారతి పేరే చెప్పారు. అంటే పార్టీలో విజయ సాయి పనైపోయిందన్న పరిస్థితి నుంచి ఆయనకు రెండో సారి రాజ్యసభ అవకాశం వచ్చేలా చేయడంతో తెరవెనుక చక్రం తిప్నిన వ్యక్తి వైఎస్ భారతేనని పార్టీ వర్గాలు ఘంటా పథంగా చెబుతున్నాయి.

విజయసాయిరెడ్డిని పెద్దల సభకు మళ్లీ ఎంట్రీ ఇప్పించడంలో వైఎస్ భారతి పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికలు రూపొందించారని అంటున్నారు.   జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు.. ఉత్తరాంధ్ర బాధ్యతలకే పరిమితమై ఉన్న విజయసాయిరెడ్డిని చూసి పార్టీ వర్గాలు ఇక పార్టీలో నంబర్ 2 పోస్టులు అంటే ఇంత కాలం విజయసాయి అనుభవించిన ఆ అనధికార హోదాను ప్రభుత్వ సలహాదారు సజ్జల కొట్టేశారనే అంతా అనుకున్నారు.  

  ఇటీవల ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించి.. పార్టీలోని కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితం చేయడం, అదే సమయంలో సజ్జలకు పార్టీ పరంగా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో విజయసాయి పనైపోయిందనే అంతా భావించారు. సరిగ్గా అక్కడే వైఎస్ భారతి  సజ్జల బాధ్యతలకు కత్తిరేసి మరీ.. ఆయన వద్దనున్న కీలక బాధ్యతలు  విజయసాయిరెడ్డికి అప్పగించేలా చక్రం తిప్పారని అంటున్నారు. దీంతో మళ్లీ విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ స్థానం తర్వాత స్థానంలోకి అంటే అనధికార నంబర్ టూ పోజిషన్ లోకి వచ్చేసినట్లైంది.  

జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం వెనకుండి వ్యూహాలు రచించింది, క్షేత్ర స్థాయిలో శ్రమించింది ముమ్మాటికి విజయసాయిరెడ్డేనని,    అందుకే విజయసాయిరెడ్డికి రెండో సారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలనీ భారతి పట్టుబట్టి మరీ జగన్ ను ఒప్పంచినట్లు పార్టీ వర్గాలలో ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది. అంతే కాదుఈడీ కేసు విచారణ వాయిదా పడాలన్నా.. సీబీఐ కోర్టులో వాయిదాలకు వెళ్లకుండా మినహాయింపు పొందాలన్నా..   మన కోసం ప్రధాన మంత్రి కార్యాలయంలోకి డైరెక్ట్‌గా వెళ్లి రావాలన్నా...  హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ఏపీ భవన్‌లో మనం వెయిట్ చేయకుండా ఉండాలన్నా.. విజయసాయి ఉండాలని  జగన్‌కు ఆయన సతీమణి   భారతి నచ్చచెప్పి ఒప్పించినట్లు చెబుతున్నారు.

అలాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కేబినెట్ నుంచి ఉద్వాసన, పలువురు పాత మంత్రుల కొనసాగింపు వ్యవహారంలో  ముఖ్య మంత్రి  సతీమణి తెరవెనుక మంత్రాంగమే కారణమని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వైసీపీ వర్గాలు ఇప్పుడు కొత్తగా భారత్ పవర్ సెంటర్ అని కనిపెట్టినట్టు చెబుతున్నారు కానీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు మాత్రం జగన్ రిమోట్ ఆయన సతీమణి భారత్ చేతిలో ఉందని ఎప్పుడో చెప్పేశారు.  రాష్ట్రానికి సీఎం   జగన్ అయినా..  పాలించేది మాత్రం  భారతేనంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల తాలుకు వీడియో క్లిప్పింగులు ఇప్పుడు సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని వైసీపీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్ అంటూ చెబుతున్నాయి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి.
‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది. 
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో.
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.
తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్.
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు.
గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.