Publish Date:Sep 25, 2025
పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోళ్లూ వదిలేశారన్నట్టుగా మారింది పాపం వాలంటీర్ల పరిస్థితి. ఫైనల్ గా మేమొచ్చాక మీకంటూ ఒక భరోసా ఇస్తామన్న కోణంలో వీరికి ఊరట కల్పించాల్సిన వీరి సృష్టికర్త జగన్.. కాస్తా.. వీరికి మొండి చేయి చూపించేశారు. ఇప్పటి వరకూ నేను చేసిన అతి పెద్ద తప్పిదం వాలంటీర్లను నమ్మడం అన్న ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా కొన్ని కీలక కామెంట్లు చేశారు. అవేంటో చూస్తే.. వైసీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన జగన్ తన ఐదేళ్ల పాలనలో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నష్టపోయినట్టు అభిప్రాయ పడ్డారాయన. గతంలో వాలంటీర్లకు అవసరానికి మించి ప్రయారిటీ ఇవ్వడమే కొంప ముంచినట్టు తేల్చి చెప్పేశారు. వీరి కారణంగా గ్రామ, మండల స్థాయి కార్యకర్తలను విస్మరించామని.. ఇదే తమ పార్టీ ఓటమికి ప్రధానకారణంగా చెప్పుకొచ్చారు జగన్.
ఈ సారికి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తాననీ, ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ల ద్వారానే ప్రజలకు చేరవేసేలా చేస్తామనీ కార్యకర్తలను ఊరడించేలా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కార్యకర్తలే అన్నింటా క్రియాశీలకంగా పని చేస్తారని అన్నారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవల్సి ఉందని అన్నారు. లోకల్ ఫైట్ కి అందరూ సన్నద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారాయన.
దీన్ని బట్టి చూస్తుంటే.. జగన్ తన కార్యకర్తలను బిస్కెట్ వేయడంలో భాగంగానే ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు వాలంటీర్లకు హ్యాండ్ ఇవ్వడాన్ని బట్టీ చూస్తే జగన్ మడమ తిప్పం, మాట తప్పం అనే పదాలు కేవలం వైసీపీ సోషల్ మీడియా వింగులు రాసుకోడానికి తప్ప ఎందుకూ పనికి రావన్న కామెంట్లు ఒకింత జోరుగానే వినిపిస్తున్నాయ్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-jhalak-to-volunteers-39-206870.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.