లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం.. సిట్ అరెస్టులపై మింగలేక కక్కలేక జగన్?

Publish Date:Feb 11, 2025

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా ఇరుక్కుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచ్చులో జగన్ చిక్కుకున్నారా? అంటూ పరిశీలకులు ఔననే అంటున్నారు. తిరుమలలడ్డూ ప్రసాదం కల్తీ విషయం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో  వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేశారంటూ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో పూర్తిగా రాజీపడ్డారనీ, కాసుల కక్కుర్తితో కల్తీ నెయ్యి వాడకానికి తలుపులు బార్లా తెరిచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ తరుణలో సుప్రీం కోర్టు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ విషయంపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ ను నియమించింది.

సుప్రీం కోర్టు నియమించిన సిట్ లో సీబీఐ నుంచి ఇద్దరు సభ్యులు, రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరు సభ్యులు, అలాగే కేంద్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి ఒక సభ్యుడూ ఉణ్నారు. ఈ స్వతంత్ర సిట్ ఏర్పాటైన తరువాత కొంత కాలం నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎటువంటి వార్తలూ వినిపించలేదు. పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వైసీపీయులు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారంటూ విమర్శలు గుప్పించింది. తమ పార్టీని అప్రదిష్ట పాలు చేయడానికే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని దుయ్యబట్టింది. చంద్రబాబు చేసినవి అసత్య ఆరోపణలు కనుకనే ఆయన కల్తీ నెయ్యి విషయం మాట్లాడటం లేదని విమర్శలు గుప్పించింది. సుప్రీం కోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో చంద్రబాబు ఆరోపణలన్నీ సత్యదూరాలని తేలుతాయనీ, అందుకే ఆయన మౌనం వహించారనీ ఎడాపెడా చెలరేగిపోయింది. 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను కూడా ఇందులోకి లాగి.. చంద్రబాబు లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి ఆరోపణలు చేసినందుకే వెంకన్న దేవుడికి ఆగ్రహం వచ్చిందని, అందుకే ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిందనీ భాష్యాలు చెప్పింది. ఇతర విషయాలపై దృష్టి పెట్టారని విమర్శలు గుప్పించింది. వైసీపీ నేతలే కాదు స్వయంగా వైసీపీ అధినేత జగన్ కూడా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు స్వతంత్ర సిట్ ను నియమించడంతో తన అసత్యాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారనీ, అందుకే మౌనం వహించారనీ జగన్ విమర్శలు గుప్పించారు. ఇలా విమర్శలు గుప్పించడం ద్వారా తాము సుప్రీం కోర్టు నియమించిన సిట్ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తుందని విశ్వసిస్తున్నామని చెప్పకనే చెప్పినట్లైంది. 

అయితే ఇక్కడ చంద్రబాబు మౌనం వైసీపీకి వేసిన ట్రాప్ అని ఇప్పుడు తేటతెల్లమైంది.  ఎందుకంటే తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తి నెయ్యి వినియోగం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన సిట్ కొన్ని అరెస్టులు చేసింది. ఇప్పుడు తన దర్యాప్తులో స్వతంత్ర సిట్ కనుగొన్న విషయాలను వైసీపీ, జగన్ అంగీకరించి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అరెస్టులన్నీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వెనుక వైసీపీయుల హస్తం ఉందని రుజువు చేసేవిగానే ఉన్నాయి. దీంతో  వైసీపీ, జగన్ పరిస్థితి ఇప్పుడు కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. 

అదే చంద్రబాబు సుప్రీం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన తరువాత కూడా ఈ అంశంపై తరచుగా మాట్లాడుతూ, దర్యాప్తు పురోగతిపై ఆరాతీస్తూ ఉండి ఉంటే.. జగన్, ఆయన పార్టీ నేతలూ సిట్ పై తమకు నమ్మకం లేదంటూ ప్రకటనలు గుప్పించేవారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా మైనం వహించడం ద్వారా చంద్రబాబు జగన్ కు ఉచ్చు పన్నారని భావించాల్సి ఉంటుంది. సిట్ దర్యాప్తులో నెలల పాటు ఎటువంటి పురోగతీ కనిపించకపోవడంతో ఇది కూడా తన అక్రమాస్తుల కేసులా మూలనపడినట్లే అని భ్రమించిన జగన్ చంద్రబాబు అబద్ధాలు చెప్పారనీ, సిట్ దర్యాప్తు సజావుగా సాగుతోందనీ, దానిపై విశ్వాసం ఉందనేలా ప్రకటనలు గుప్పించి నేరుగా చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నట్లైంది.  ఈ కేసులో సిట్ ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖర్, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, భూలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ లను అరెస్టు చేసింది. దీంతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు అభూత కల్పనలు కావనీ, అక్షర సత్యాలనీ రుజువైనట్లైంది. ఇప్పుడు అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను మార్చేసి, ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టినట్లు సందేహాతీతంగా రుజువైంది. వైసీపీ అధినేత జగన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. 

By
en-us Political News

  
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా? పోరాడి ఓడిపోవడం కంటే ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా? సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?
సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌ యాక్ష‌న్ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని నిల‌దీశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (మార్చి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు. గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు? అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది? అంటే స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
 అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి  చనిపోయింది.
వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.
పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ  జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.