జ‌గ‌న్ ఆశ అడియాశే.. వైసీపీ ఆట ముగిసిన‌ట్లే!?

Publish Date:Nov 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌త ఐదేళ్లు క‌నీస స‌దుపాయాలులేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే రోడ్ల మ‌ర‌మ్మ‌తుల ద‌గ్గ‌ర నుంచి ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం మొద‌లైంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే..  రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారం కోల్పోయిన నాటి నుంచి  అనేక మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలలో చేరారు. మ‌రికొంద‌రు ఆ దారిలోనే నడిచేందుకు రెడీగా ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జ‌గ‌న్ మాత్రం జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దేప‌దే చెబుతూ ముఖ్య‌నేత‌లు పార్టీ వీడ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంలోని పార్టీల నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తేలా వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నం అవుతుందనీ, మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహిస్తాననీ  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ల‌లు కంటున్నారు. తాజాగా అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ ఆశ‌లు అడియాశల‌యిన‌ట్లేన‌ని వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌హా వైసీపీకి చెందిన ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బాయ్ కాట్ చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీకి హాజ‌ర‌వుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. స‌మ‌స్య ప‌రిష్కారానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో గ‌త ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్ర‌శాంత‌వాతావ‌ర‌ణంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుlన్నది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రులు, కొంద‌రు వైసీపీ స‌భ్యులు అస‌భ్య‌ ప‌ద‌జాలంతో అప్పటి ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌పై తీవ్ర‌ స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దీంతో ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అంటేనే ప్ర‌జ‌లు టీవీలు బంద్‌పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ, చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. తాజాగా.. బుధ‌వారం (నవంబర్ 20)   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అద్భుత‌మైన పాల‌న సాగుతున్నద‌ని అన్నారు.  ఐదు సంవ‌త్స‌రాలే కాదు.. ద‌శాబ్ద‌కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు నాయుడే ఉంటార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం దిగ్విజ‌యంగా ముందుకు సాగుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌ల ఆశ‌లు అడియాశ‌లైన‌ట్లేన‌ని చెప్పొచ్చు. 

అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నుంచి తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోకి  వ‌ల‌స‌లు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వైసీపీ హ‌యాంలో బూతుల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. సహజంగా వీరిలో వైసీపీకి చెందిన నేత‌లే ఎక్కువ‌గా ఉన్నారు. దీనికి తోడు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపైనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు కూట‌మిపార్టీల్లోకి చేరేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. జ‌మిలి ఎన్నిక‌లు రాబోయేతున్నాయి.. మ‌ళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంద‌ని పదేప‌దే చెబుతుండ‌టంతో కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌లు కాస్త వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను సైతం బెదిరింపుల‌కు గురిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టిన అధికారుల‌ను గుర్తుపెట్టుకొని మేము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌ల‌ హెచ్చ‌రించారు. అంతే కాదు.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టి.. త‌రువాత‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది విదేశాల‌కు పోయిన‌వారినిసైతం ప‌ట్టుకొచ్చి  జైలుకు పంపిస్తామంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. దీంతో కొంద‌రు అధికారులు వైసీపీ నేత‌ల జోలికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌తో.. వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి చేరే నేత‌ల‌ సంఖ్య పెర‌గ‌నుండ‌టంతో పాటు.. అధికారుల్లో దైర్యాన్ని నింపిన‌ట్ల‌యింది.

By
en-us Political News

  
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.