ఏపీ సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించి ప్రారంభించిన ఒక్కో పథకానికీ మెల్లిమెల్లిగా చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారా? అమ్మ ఒడి పథకానికి కండీషన్స్ తో దాదాపు చరమగీతం పాడేసిన జగన్ ఇప్పుడు రైతు భరోసాకూ శఠగోపం పెట్టేయనున్నారా? వైసీపీ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలలో రైతు భరోసా ఒకటి. ఏటా రైతు ఖాతాలో పన్నెండున్నర వేలు జమ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకానికి ఈ ఏడాది మంగళం పాడేశారంటున్నారు పరిశీలకులు. ప్రతి ఏటా మే నెలలో రైతు ఖాతాలలో సొమ్ములు జమ కావలసి ఉండగా.. ఈ ఏడాది ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనా ప్రభుత్వం నుంచి రాలేదు. అంటే ఈ నెలలో ఇక రైతు భరోసా సొమ్ములు అందనట్లేనని రైతులు సైతం నిర్ణయానికి వచ్చేశారు. అసలు వాస్తవంగా జగన్ జగన్ రైతు బరోసా కింద ఇచ్చింది ఏడాదికి ఏడున్నరవేలే. కేంద్రం ఇచ్చిన ఆరున్నర వేలను మినహాయించుకుని జగన్ రైతు భరోసా ఇచ్చారు. ఇచ్చిన ఏడున్నర వేలూ కూడా రెండు విడతల్లో ఇచ్చారు. రెండేళ్ల పాటు ఏడాదికి ఏడున్నర వేలు చొప్పున ఇచ్చిన జగన్ మూడో ఏడాది ‘భరోసా’కు హామీ లేదని చెప్పకనే చెబుతున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా కోసం బడ్జెట్ కేటాయించి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన జగన్ సర్కార్ ఆ లబ్ధిదారుల జాబితాను మాత్రం రైతు భరోసా కేంద్రాలలో ఇంత వరకూ ప్రదర్శించలేదు.
గత నెల 15 నాటికే జాబితా సిద్ధమైనప్పటికీ దానికి ఇంకా ప్రదర్శించక పోవడంతో ఈ ఏడాది రైతు భరోసాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉద్యోగుల జాతాలే ఎప్పుడు చెల్లిస్తామన్నదే చెప్పలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం.. రైతు భరోసా గురించి ఏం చెప్పగలుగుతుందని పరిశీలకులు అంటున్నారు. ఆర్థిక కష్టాల పేరు చెప్పి ఒక్కో పథకాన్నీ ఆంక్షల చట్రంలో బిగించేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిచుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అంటున్నారు.
అదే దారిలో రైతు భరోసాకు మంగళం పాడేసే ఉద్దేశంతోనే సర్కార్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం సర్కార్ ముందున్న పెద్ద గండం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడం. అందు కోసమే రమారమి నలుగున్నర కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ముందుగా ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతనైనా రైతు భరోసా గురించి ఆలోచిస్తుందా అంటే ప్రభుత్వానికి ఆ వెసులు బాటు లేదనీ, వచ్చే నెలలో అమ్మ ఒడి పథకం అమలు వ్యయం తరుముకు వస్తున్నదనీ ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమ్మ ఒడి పథకం అమలును ఇప్పటికే వాయిదా వేశారు. అదీ అలాంటిలాంటి వాయిదా కాదు. ఏకంగా ఒక ఏడాది అమ్మఒడికి మంగళం పాడేసేంతగా. అందుకే అమ్మ ఒడి పథకం అమలును మరోసారి వాయిదా వేయలేని అనివార్యతను జగన్ సర్కార్ ఎదుర్కొంటున్నది. అందుకే రైతు భరోసాపై జగన్ ఈ ఏడాది ఇక దృష్టి సారించే అవకాశమే లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-government-to-skip-raithu-bharosa-25-135416.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.