Publish Date:Jun 23, 2022
సోదరి పెళ్లికి అన్న ఎంతో కొంత యివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అవసరమయితే బంధువులూ ఎంతో కొంత ఆర్ధిక మద్దతు ఇస్తూంటారు. రాష్ట్రంలో పేద వారింట పెళ్లికి ప్రభుత్వాలు ఆర్ధిక మద్దతు ప్రకటిం చడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్లో దుల్హన్ పథకం అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పేద ఇంటి అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం తరఫున యాభయి వేలు ఇవ్వడం ఆ పథకం లక్ష్యం. ఇది కొంత కాలం బాగానే నడిచింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ పథకం మరింత ఆకర్షణీయం చేయడానికి ఈ పథకం ద్వారా వధువుకి లక్షరూపాయలు ఇస్తామని బాగా ప్రచారం చేసేరు. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు తల్ల కిందులయి అసలు ఆ పథకానికే స్వస్తి పలికారు. ఇక నుంచి ఆ పథకం అమలుకాదట. ఈ సంగతి ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. అడ్డగోలు ఆర్థిక విధానాలతో అందినకాడకల్లా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా స్థితికి తెచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించుకున్న పథకాలను ఒకటొకటిగా వదులుకుంటోంది.
రాష్ట్రాన్ని నడపడానికి నిధులు లేకపోవడం, అప్పుల వూబిలోకి దిగజారుతూండడంతో ఇక పథకాలను అనుకున్నట్టుగా అమలు అసాధ్యమన్నది అర్ధమయింది. అందుకనే దుల్హన్ పథకం పై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులతో పథకం నిలిపివేశామని తెలిపింది. ముస్లిం యువతుల వివాహానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చేది.
ఆ ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. జగన్ ప్రభు త్వం ఈ హామీ విస్మరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖ లైంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పథకం అమలు చేయడంలేదని పిటిషన్లో పేర్కొన్నారు. పథకం అమలుకు డబ్బులు లేవని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అఫిడవిట్లపై తగిన సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్ తరుఫు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-government-takes-u-turn-on-dulhan-scheme-39-138262.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!