అప్పులు అయిపోయాయి.. ఇక, విరాళాల వేట.. జగన్ సర్కారు కొత్త ఎత్తు!

Publish Date:Jan 22, 2022

Advertisement

అప్పుల ఊబిలో కురుకు పోయి , ఇక అప్పులు పుట్టని స్థితికి చ్రుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కసులకోసం  కొత్త ఎత్తులు వేస్తోందా,అంటే అవుననే అంటున్నారు లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషకులు. ఏపీ ప్రభుత్వం పేరు చెపితే ఎక్కడా పైసా అప్పు పుట్టడం లేదు. అవకాశం  ఉన్న వరకు అప్పు పాత్రలు అన్నింటినీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడోనే పూర్తిగా తుడిచేసింది.(గిట్టని వాళ్ళు అయితే నాకేసిందని అంటారనుకోండి అది వేరే విషయం,)  ఇక ఎక్కడా రూపాయి కాదు కదా, హాఫ్ రూపీ అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదనేది అందరికి తెలిసిన విషయమే.  రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్లమెంట్ ఉభయ సభలలో  వైసేపీ  నాయకులు ఒకటికి రెండు సార్లు గోడు వెళ్ళబోసుకున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక  స్థితి అధ్వాన్నంగా ఉందని కానీ, అప్పులు పుట్టని దుస్థితి ఉందని గానీ , వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. 

అందుకే, ఇక ఇలా కాదని, ఏపీ ప్రభుత్వం కాసు కొత్త ఎత్తులు వేస్తోందని విస్వవసనీయ వర్గాల సమాచారం. అప్పులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, విరాళాలు అయినా ఇవ్వండని, దేశీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలను వేడుకునేందుకు, ఏపీ ప్రభుత్వం సిద్డంవుతోందని అధికార వర్గాల సామాచారం.  ప్రస్తుతానికి, నాడు – నేడు పేరుతొ అమలవుతున్న పాఠశాల భవనాల రంగులు, హంగులు కార్యక్రమానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి దాతలనుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పాఠశాలలో ఆవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.6321 కోట్లు అవసరమని గుర్తించి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలుసేకరించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన విధివిధానాలు, ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయని, అదికార వర్గాలు అంటున్నాయి. 

అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వెనక చాల పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విరాళాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలను కఠినతరం చేసింది. దేశంలో ఇంచుమించుగా ఆరు వేల వరకు స్వచ్చంద సంస్థల లైసెన్సులను కేంద్రహోమ్ శాఖ రద్దు చేసింది. అంటే ఆ సంస్థలకు ఇక విదేశాల నుంచి విరాళాలు రావు. ఇందులో టీటీడీ సహ, ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం వంటి సంస్థలు ఉన్నా, సేవా కార్యక్రమాల ముసుగులో మతమార్పిడులకు పాల్పడే, క్రైస్తవ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా, ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యంలోనే నాడు – నేడు పేరిట విదీశీ మిషనరీలకు బ్యాక్ డోర్ ఎంట్రీ కలిపించేందుకు, జగన్ రెడ్డి ఈ ఎత్తు వేశారా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు సంబందించిన విధివిధానాలు వెలువడితేనే గానీ, అసలు కుట్ర ఏమిటన్నది తేలదు. స్వచ్చంద సంస్థలు ఇచ్చే విరాళాలను ప్రభుత్వం నేరుగా సేకరిస్తుందా, లేక అప్పుల కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట,ఒక సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేసిన విధంగా విరాళాల సేకరణకు మరో సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేస్తుందా, అనేది తేలితే గానే, విరాళాల అసలు రంగు బయట పడదని అంటున్నారు. అయితే, అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలతో వైఎస్సార్ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు.

By
en-us Political News

  
తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇప్పటి వరకూ గంటా పోటీ ఎక్కడ నుంచి అన్న సందిగ్ధతకు తెరదించేసింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం.
భారత రాష్ట్ర సమితి ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ 2018 ఎన్నికలలో (అప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్) ముందస్తుకు వెళ్లడమే కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది.
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.