ఆంధ్రాలో 'మర్యాదలు' అడుక్కుంటున్న పోలీసు బాసులు

Publish Date:Jan 22, 2022

Advertisement

ఆంధ్రా ఐపీఎస్ ఆఫీసర్లకు ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య తమదే అయినా దానికి పరిష్కారం మాత్రం వారి చేతుల్లో లేకపోవడమే విశేషం. తాము ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతిపక్షం నుంచి పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. ఇది మరీ విచిత్రమైన సమస్య. ఒక వస్తువు ఎక్కడ పోయిందో అక్కడ వెదికితేనే దొరుకుతుందని ఎంత చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. పోయిన చోటే వెదుక్కో పోరా.. అని మన పెద్దలు కూడా చిన్నప్పట్నుంచే చెవినిల్లు కట్టుకొని చెబుతారు. కానీ ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం ఇంత చిన్న లాజిక్ ను మిస్సవుతుండడమే అసలు పాయింటు. 

ఇక విషయానికొద్దాం. మొన్న గుడివాడ ఘటన తరువాత ఐపీఎస్ అధికారుల సంఘానికి ఓ పేద్ద డౌటొచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణంతా తామే దగ్గరుండి చూసుకునే ఖాకీ బాసులు అయినప్పటికీ ప్రజలంతా తమను ఎందుకనో లైట్ తీసుకుంటున్నారన్న అనుమానం మొదలైంది. అనుమానం వచ్చిందే తడవు ఓ అనౌన్స్ మెంటు ప్రిపేర్ చేశారు. ప్రజల మీదికి వదిలారు. ఐపీఎస్ అధికారులను ప్రతిపక్షాలు లైట్ తీసుకుంటున్నాయని, ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ బాసును ఏకవచనంతో సంబోధించడంతో తామంతా హర్ట్ అవుతున్నామని, శాంతి భద్రతల నిర్వహణలో నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే తమనే ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని, ఇది తమకెంతో అవమానకరమని, ఖాకీ బట్టలేసుకున్న తమకు ఈ అవమానమే ఎంతో అమర్యాదాకరమని, ప్రతిపక్షాలు కాసింత మర్యాదలు నేర్చుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఓ ప్రకటన జారీ చేశారు.. ఐపీఎస్ అధికార్ల సంఘం జాయింట్ సెక్రటరీ ఆర్పీ మీనా. 

ఇదంతా ఎందుకొచ్చిందంటే గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన కె.కన్వెన్షన్ లో విచ్చలవిడిగా జూదం ఆడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దానిపై నిజనిర్ధారణ కోసం టీడీపీ ఆధ్వర్యంలో కొంతమంది నాయకుల బృందం అక్కడికి బయల్దేరింది. అయితే టీడీపీ నాయకులు అక్కడకు వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ నేతల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అసలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే సబబుగా ఉంటుంది. వైసీపీ నేతల వాహన ప్రవాహాన్ని శక్తివంచన లేకుండా యథేచ్ఛగా ముందుకు పోనిచ్చారనేది ఇంకా కరెక్టు. దీంతో ఏమైంది? మందబలం చూసుకున్న వైసీపీ నేతలంతా రెచ్చిపోయి టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. కనీసం అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా వారి వాహనాల్ని కూడా వ్యూహాత్మకంగా ధ్వంసం చేశారు. పనిలో పనిగా నోటిక్కూడా పని చెప్పి బూతు పురాణాలు అందుకున్నారు. అసలక్కడ క్యాసినో లాంటి అంతర్జాతీయ జూదక్రీడ జరగనప్పుడు టీడీపీ నిజనిర్ధారణ టీమ్ ను ఆపడం దేనికి? అక్కడ క్యాసినో ఒకవేళ జరిగితే జరుగుతున్నట్టు ప్రజలు తెలుసుకుంటారు. జరక్కపోతే అలాంటిదేం లేదని, ప్రతిపక్ష టీడీపీనే అనవసరంగా డ్రామా క్రియేట్ చేసిందని ప్రజలే నిర్ధారించుకుంటారు కదా. జరగాల్సిన కార్యక్రమాన్ని శాంతిభద్రతల సమస్య రాకుండా జరగనిస్తే అయిపోయేదానికి ఈ ప్రకటన దాకా తీసుకురావడంలో ఆంతర్యమేంటి? అసలు  తాము చేయాల్సిన పని చేయకపోవడం వల్లే ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయన్న సింపుల్ లాజిక్ ను పోలీసులు ఎందుకు మిస్సవుతున్నారని అడుగుతున్నారు సామాన్య జనం. పోనీ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీడీపీ పరివారాన్ని ఆపారే అనుకుందాం. మరి వైసీపీ నేతలను కూడా అదే తరహాలో ఆపి ఉండాల్సింది కదా. అలా జరిగినప్పుడే పోలీసు బాసులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించినట్లు అవుతుంది కదా. ఆ పని చేయలేని, చేత కాని నిర్వాకం చేత.. కడుపు రగిలిన ప్రతిపక్షాలు పోలీస్ అధికారుల వైఫల్యాల మీద విరుచుకుపడితే, ఓ నాలుగు ఘాటైన వ్యాఖ్యలతో చురకలంటిస్తే అది వారి తప్పెలా అవుతుంది? ఈ మాత్రం విమర్శలు కూడా తట్టుకోలేనివారు... మరి అధికార పార్టీకి అంతలా ఏజెంట్లలాగా వ్యవహరించడం ఎందుకున్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తే ఆ తప్పెవరిది?

అయినా ఖాకీ బాసులు విఫలమైనప్పుడు ఇక ప్రతిపక్షాలకు మిగిలిందేమిటి? ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తమ గోడేంటో వెళ్లబోసుకోవడమే కదా. దానిక్కూడా ఐపీఎస్ అధికారుల సంఘం ఉడుక్కుంటే ఎలా? అసలు మీనా అంటున్నదేంటి? డీజీపీ గౌతం సవాంగ్ ను ఏకవచనంతో సంబోధిస్తారా.. అని. ఏం? ఏకవచన ప్రయోగం ఏమైనా నేరామా? ఘోరమా? అప్రజాస్వామికమా? అవమానకరమైన పద ప్రయోగమా? పోనీ... నువ్వు అనే పదాన్ని ఐపీఎస్ సంఘం సంస్కార రహితంగా భావిస్తున్నదా? ఖాకీ బట్టల అంకిత భావాన్ని తమరు చేజేతులా అధికార పార్టీ ముందు ఒగ్గేస్తే... మాటలు పడి, దెబ్బలు తిని, వాహనాలు కోల్పోయి చెల్లాచెదురైన టీడీపీ నేతలు.. ఏకవచన ప్రయోగం చేసినందుకే మీకు మర్యాద లోపించినట్లు అనిపించిందా? ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? ఈ మాత్రం కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదు కాబట్టే... ఆంధ్రా పోలీసు బాసులు మర్యాదలను అడుక్కోవాల్సిన దుస్థితిలో పడిపోయారని సామాన్య జనం చెవులు కొరుక్కుంటున్నారు. కనీసం ఇకనుంచైనా ఇలా మర్యాదలు అడుక్కోవడం కాకుండా మీ మర్యాదల్లో మీరుంటే ఎదుటివారు కూడా మర్యాదలు పాటిస్తారని, లేనిపక్షంలో వారిచేతుల్లో మళ్లీ మర్యాదలు చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.