విజయసాయిపై జ‘గన్’ఫైర్: పీకే సర్వేలే రీజన్!

Publish Date:Apr 19, 2022

Advertisement

వైసీపీలో ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో? ఎప్పుడు ఎవరిని అధ:పాతాళానికి పడేస్తారో ఎవరి ఊహకూ అందదు. ఒకప్పుడు వైసీపీలో అంతా తానే అన్నట్లుగా విజయసాయి ప్రభ వెలిగింది. ఆ తరువాత ఏం జరిగిందో కానీ...క్రమంగా ఆయన ప్రభ పార్టీలో మసకబారుతూ వచ్చింది. పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించిన విజయ సాయి ఆ తరువాత ఉత్తరాంధ్ర ఇన్ చార్జి బాధ్యతలకే పరిమితం అయ్యారు. అంతలోనే ఏమైందో ఇప్పుడు ఆ నామమాత్రపు బాధ్యతల నుంచి కూడా తప్పించేసిన జగన్ విజయసాయిని ఉత్సవ విగ్రహ స్థాయికి తగ్గించేశారు. 

  విజయసాయి అధినేతకు అత్యంత ఆప్తుడిగా, విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఎటువంటి రాజకీయ అనుభవమూ లేకపోయినా...పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. అయితే ఇదంతా కొద్ది కాలమే...క్రమంగా విజయసాయి పార్టీలో కీలక స్థానం నుంచి ఒక్కో మెట్టూ దింపేస్తూ వచ్చిన జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జి పదవికి పరిమితం చేశారు. ఇప్పుడు ఆ పదవిని కూడా ఊడబీకేయడంతో ఇక వైకాపాలో విజయసాయి పాత్ర నామమాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తాజాగా వెల్లడించిన జిల్లా ఇన్ చార్జిల జాబితాలో విజయసాయి పేరు గల్లంతైంది. పార్టీ కేంద్రకార్యాలయానికి రమ్మని పిలిచారని అంటున్నప్పటికీ ..అక్కడ కూడా ఆయనకు క్రియాశీలంగా పని చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు.  ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయి రెడ్డి పనితీరు వల్ల అక్కడ పార్టీకి నష్టం జరగిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్నది పరిశీలకుల అభిప్రాయం.  అయితే తాజా ఇన్ చార్జీల జాబితాలో పార్టీలో మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు కూడా గల్లంతయ్యాయి. వారు కూడా తక్కువ వారేం కాదు. పార్టీ రాజకీయ సలహాదారుగా ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరైతే...మరొకరు సాక్షాత్తూ జగన్ బంధువు, ప్రస్తుతం టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి. 

 ముఖ్యంగా విజయసాయిరెడ్డిపై జగన్ ఆగ్రహానికీ అసంతృప్తికీ కారణాలేమిటన్న ప్రశ్నకు....క్యాడర్ లో విజయసాయి రెడ్డికి ఉన్న గుర్తింపేనన్న సమాధానం వస్తుంది. తన తరువాత తనంతటి వాడిగా విజయసాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే జగన్ ఆయనను కేవలం ఉత్తరాంధ్రకు పరిమితం చేశారనీ, అయితే అక్కడా ఆయన తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యం అధినేత ఆకాంక్షల మేరకు పార్టీని నడిపించేలా పని చేయలేదన్న భావనకు జగన్ రావడమేనని అంటున్నారు. 

వీటికి తోడు 2019 ఎన్నికలలో జగన్ విజయానికి వ్యూహరచన చేసి విజయవంతంగా అమలు చేసిన ప్రశాంత్ కిషోర్ 2024లో కూడా ఏపీలో మరోసారి జగన్ పార్టీని గెలిపించేందుకు పని చేయనున్నారు. ఆయన చేసిన సర్వేలు, వాటి ఫలితాల ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనీ...అందులో భాగమే విజయ సాయి రెడ్డి ప్రాధాన్యాన్ని కుదించేయడం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయికి మరో మారు రాజ్యసభ అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా దాదాపు మృగ్యమనే అంటున్నారు.  

మెత్తానికి వైసీపీలో విజయసాయి ప్రభ మసకబారడానికి ఎవరు ఏయే కారణాలు చెప్పినా జగన్ ఎవరినీ ఎక్కువ కాలం నమ్మరన్నదే వాస్తవం. 
జిల్లాఇన్ చార్జీల లిస్టులో సజ్జల, వైవీ రెడ్డి పేర్లూ గల్లంతవ్వడమే ఇందుకు  నిదర్శనం. 

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.