ఐదేళ్లలో జగన్ చేసిన అప్పు అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్లు!
Publish Date:Jul 26, 2024
Advertisement
మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అక్షరాలా ఆరులక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను తన ఆర్థిక అరాచకత్వంతో జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చేశారు. 2019మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 3లక్షల 75 వేల 975 కోట్ల రూపాయలు కాగా, 2019 మే లో జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. ఎన్నికలలో పరాజయం పాలై గద్దె దిగే సమయానికి రాష్ట్ర అప్పులు 9 లక్షల 74 వేల 556 కోట్ల రూపాయలు. అంటే ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వీటిలో ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.4,38,278లు కాగా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 2,48,677 రూపాయలు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (జులై26) విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన గణాంకాలివి. ఈ సందర్భంగా చంద్రబాబు.. అప్పుల పద్దు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నారు. ఇంకా వెలుగులోకి రావాల్సిన అప్పులు చాలా ఉన్నాయన్నారు. జగన్ నిర్వాకం కారణంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం కారణంగా 52 వేల 900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. ఈ 52, 900 కోట్ల రూపాయల నష్టంలో 45 వేల కోట్లు ఆయకట్టకు నీటి సరఫరాలో జాప్యం వల్ల వాటిల్లిందనీ, 4900 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీ, రిపేర్ల వల్ల వాటిల్లింది. జల విద్యుత్ ఉత్పత్తిలో జాప్యం వల్ల 3వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. శ్వేతపత్రం ద్వారా ఈ వివరాలన్నీ వెల్లడించిన చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఉండి ఉంటే.. ప్రభుత్వానికి జీఎస్పీపీ కాంట్రిబ్యూషన్ ద్వారా 52వేల 900 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉండేదన్నారు. అమరావతి పనుల నిలుపు దల వల్ల ప్రభుత్వానికి రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు.
http://www.teluguone.com/news/content/jagan-debts-in-5-years-39-181568.html