‘మూడు’ను పట్టుకు వేళాడుతున్న జగన్ రెడ్డి!

Publish Date:Apr 2, 2026

Advertisement

వైసీసీ అధినేత జగన్ రెడ్డి ‘మూడు’ పంతం పట్టారా? అంటే అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారమే కాదు, కనీసం విపక్ష నేత గుర్తింపు కూడా లేకుండా పోయినప్పుడూ కడా ఆయన మూడ్ మూడు మీదే ఉంది. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టినప్పుడు గతంలో తాను అమరావతికి అసెంబ్లీ వేదికగా సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి మరీ మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట మొదలెట్టారు. సరే ఆ ఆటలో ఎంత ఘోరంగా పరాజయం పాలయ్యారో 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడమే తేల్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తున్న వేళ ఆయన మరో ‘మూడు’ తో ముందుకు వచ్చారు.  

సీఎం హోదాలో నాడు అమరావతి  శాసన రాజధాని , విశాఖ  పరిపాలన రాజధాని , కర్నూలు  న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.  అది పక్కన పెడితే అప్పట్లో మూడు రాజధానుల బిల్లును జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం సమర్థవంతంగా అడ్డుకుంది.  

దాంతో మూడు రాజధానులకు చట్టబద్ధత విషయాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టం కనుక మూడు రాజధానులు అనే మూడుముక్కలాటతోనే ఐదేళ్లూ గడిపేశారు. 2024లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన చందంగా వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన్ని స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రాజధాని అమరావతిని పట్టాలెక్కించింది. ఓ వైపు పనుల వేగాన్ని పెంచుతూనే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగుల వేగం పెంచింది.  అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ   అసెంబ్లీలో ఓ తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం దానికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని సాధించింది.  

అయితే ఊరంతటిదీ ఒకదారి.. ఉలిపికట్టెదొక  దారి అన్న చంద్రంగా పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందుతున్న సమయయంలోనే జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో సారి మూడు రాజధానుల మాట ఎత్తారు. అయితే ఈ సారి అమరావతి, కర్నూలు, విశాఖ అని కాకుండా  మచిలీపట్నం,   విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా ఏర్పడాలన్నారు.

  జగన్ ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ‘మూడు’ను పట్టుకు వేళాడుతున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో  ట్రోల్ చేస్తున్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి అంటే.. దానికి ఆనుకుని ఉన్న మచిలీపట్నం,గుంటూరు, విజయవాడలు వాటంతటవే ఆటోమేటిగ్గా అభివృద్ధి చెందుతాయనడంలో ఇసుమంతైనా అనుమానాలకు ఆస్కారమేలేదు. అయితే జగన్ మాత్రం మూడు మూడంటూనే  మచిలీపట్నం, విజయవాడ,గుంటూరుల అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. 

By
en-us Political News

  
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.